ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ : రంకెలేసిన బుల్
ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన జోష్తో ఇండియన్ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్ళింది . ఇండెక్స్లు పరుగులు పెట్టాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు పదేళ్ల తర్వాత భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1,421 పాయింట్లకు పైగా పెరిగింది. అలాగే నిఫ్టీ 421 పాయింట్లు ర్యాలీ చేసింది. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వమే అధికారంలోకి రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడంతో మార్కెట్లో బుల్ రంకేసింది. స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు స్టాక్ మార్కెట్కు సానుకూల అంశం. ఎన్డీఏకు అనుకూలంగా […]
ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన జోష్తో ఇండియన్ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్ళింది . ఇండెక్స్లు పరుగులు పెట్టాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు పదేళ్ల తర్వాత భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1,421 పాయింట్లకు పైగా పెరిగింది. అలాగే నిఫ్టీ 421 పాయింట్లు ర్యాలీ చేసింది. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వమే అధికారంలోకి రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడంతో మార్కెట్లో బుల్ రంకేసింది. స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు స్టాక్ మార్కెట్కు సానుకూల అంశం. ఎన్డీఏకు అనుకూలంగా వెలువడిన ఎగ్జిట్పోల్స్ ఫలితంగా సూచీలు పరిగెత్తాయి. స్థిరమైన ప్రభుత్వం వస్తే ఆటో, ఇన్ఫ్రా, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ రంగాలు మెరుగైన పనితీరుకనబరుస్తాయని మార్కెట్ వర్గాలు భావించాయి. అందుకే ఆయా రంగాల షేర్లు నేడు పరుగులు తీశాయి.