మళ్లీ మోదీయే అన్న ఎగ్జిట్ పోల్స్.. దూసుకుపోతోన్న స్టాక్ మార్కెట్లు
కేంద్రంలో మళ్లీ ఎన్డీయే అధికారంలోకి రానుందని.. మోదీయే మళ్లీ ప్రధాని అవుతారంటూ ఆదివారం విడుదలైన అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 950 పాయింట్లకు పైగా ఎగబాకి 38,851 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 272 పాయింట్ల లాభంతో 11,679వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్లో బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ మినహా అన్ని కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, […]
కేంద్రంలో మళ్లీ ఎన్డీయే అధికారంలోకి రానుందని.. మోదీయే మళ్లీ ప్రధాని అవుతారంటూ ఆదివారం విడుదలైన అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 950 పాయింట్లకు పైగా ఎగబాకి 38,851 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 272 పాయింట్ల లాభంతో 11,679వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్లో బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ మినహా అన్ని కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్ తదితర కంపెనీలు టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.