Sensational theft: పంజాబ్‌లో భారీ దోపిడీ.. 30 కిలోల బంగారాన్ని.. 25 నిమిషాల్లోనే..

Sensational theft: పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో భారీ దోపిడీ చోటుచేసుకుంది. ఐదుగురు సాయుధులు ముసుగులు ధరించి లూధియానాలోని గిల్ రోడ్‌లో ఉన్న ఫైనాన్స్ కంపెనీ – ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐఐఎఫ్ఎల్) శాఖ నుండి సుమారు ₹ 12 కోట్ల విలువైన 30 కిలోల బంగారు ఆభరణాలను, 3 లక్షల నగదును దొంగిలించారు. సిబ్బందిని తాళ్లతో కట్టేసిన నిందితులు కేవలం 25 నిమిషాల్లో చోరీ కార్యక్రమం పూర్తీ చేశారు. కాగా, చోరీ సమయంలో నలుగురు ముసుగులు […]

Sensational theft: పంజాబ్‌లో భారీ దోపిడీ.. 30 కిలోల బంగారాన్ని.. 25 నిమిషాల్లోనే..
Follow us

| Edited By:

Updated on: Feb 18, 2020 | 3:47 PM

Sensational theft: పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో భారీ దోపిడీ చోటుచేసుకుంది. ఐదుగురు సాయుధులు ముసుగులు ధరించి లూధియానాలోని గిల్ రోడ్‌లో ఉన్న ఫైనాన్స్ కంపెనీ – ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐఐఎఫ్ఎల్) శాఖ నుండి సుమారు ₹ 12 కోట్ల విలువైన 30 కిలోల బంగారు ఆభరణాలను, 3 లక్షల నగదును దొంగిలించారు. సిబ్బందిని తాళ్లతో కట్టేసిన నిందితులు కేవలం 25 నిమిషాల్లో చోరీ కార్యక్రమం పూర్తీ చేశారు. కాగా, చోరీ సమయంలో నలుగురు ముసుగులు ధరించి కార్యాలయం లోపలికి ప్రవేశించారని, మరొకడు బయట కారులోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు.

నిందితులు డిజిటల్ వీడియో రికార్డర్ (డివిఆర్) వెంట తీసుకెళ్లారు. కొంతమంది ఉద్యోగుల అంతర్గత పాత్రను పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఐఐఎఫ్ఎల్ భద్రతా సిబ్బంది అక్కడ లేరని చెప్పారు. దుండగులు అక్కడ్నుంచి పరారైన వెంటనే ఐఐఎఫ్ఎల్ సిబ్బంది అలారం మోగించారని తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లి పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఐఐఎఫ్ఎల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, పక్క ప్లాన్ ప్రకారమే దుండుగులు ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది.

పంజాబ్ పోలీసుల క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సిఐఐ) కార్యాలయానికి ఎదురుగా క్రైమ్ స్పాట్ ఉంది. కాగా, దుండుగులు ముసుగులు వేసుకుని ఐఐఎఫ్ఎల్ కార్యాలయంలోకి చొరబడిన దృశ్యాలు, ఆ తర్వాత దోపిడీ చేసిన బంగారంతో బయటికి వచ్చిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. జన సంచారం స్వల్పంగా ఉన్నప్పటికీ ఎవరికీ అనుమానం రాకుండా దొంగలు వ్యవహరించడం గమనార్హం. కాగా, గత 20 రోజుల్లో ఇది రెండో భారీ దోపిడీ కావడం గమనార్హం. జనవరి 29న నలుగురు దుండుగులు ఆయుధాలతో ఓ నగల దుకాణంలో చొరబడి రూ. 80 లక్షల విలువైన 2 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇప్పటి వరకు ఆ కేసు తేలకపోవడం గమనార్హం.

మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..