వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు

హైదరాబాద్: సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు వైసీపీలో చేరారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు జగన్ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో వీరభద్రరావు భేటీ అయ్యారు. పార్టీలో చేరిన అనంతరం దాడి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో చేరాను కాబట్టి తనను పార్టీ ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా పని చేస్తామని చెప్పారు. అది జగన్ మోహన్ రెడ్డిగారి మీద […]

వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు
Follow us

|

Updated on: Mar 09, 2019 | 12:19 PM

హైదరాబాద్: సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు వైసీపీలో చేరారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు జగన్ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో వీరభద్రరావు భేటీ అయ్యారు.

పార్టీలో చేరిన అనంతరం దాడి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో చేరాను కాబట్టి తనను పార్టీ ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా పని చేస్తామని చెప్పారు. అది జగన్ మోహన్ రెడ్డిగారి మీద ఆధారపడి ఉందని అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ రాష్ట్రం బాగుపడుతుందని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. జగన్‌‌కులాగ ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన వారు ఎవరూ లేరని, ఈ పాదయాత్ర ద్వారా జగన్ ప్రజల సమస్యలను క్షుణ్ణంగా తెలసుకున్నారని దాడి వీరభద్రరావు అన్నారు.

చంద్రబాబు గారు రోజుకొకటి, గంటకొకటి, క్షణానికి ఒక ఆరోపణ చేస్తారని, చంద్రబాబుది మల్టీ టంగ్ అని దాడి ఆరోపించారు.