సెకండ్ ఇన్నింగ్స్‌లో సీనియర్ హీరోయిన్లు.. వన్నె తగ్గని నటీమణులు!

ఒకప్పుడు హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన ఎందరో నటీమణులు.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా అవార్డులు కూడా సొంతం చేసుకుంటున్నారు. వాస్తవానికి చూస్తే హీరోయిన్లకు హీరోల కంటే తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఇండస్ట్రీ ఏదైనా సంగతి ఇంతే. ప్రస్తుతం టాలీవుడ్‌లో జరుగుతున్న ట్రెండ్‌ను పరిశీలిస్తే.. గత ఐదు సంవత్సరాల్లో ఎందరో కొత్త హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో కొంతమంది ఇండస్ట్రీలో పాతుకుపోతే.. మరికొందరు చిన్నా చితక […]

సెకండ్ ఇన్నింగ్స్‌లో సీనియర్ హీరోయిన్లు.. వన్నె తగ్గని నటీమణులు!
Follow us

|

Updated on: Sep 15, 2019 | 4:41 PM

ఒకప్పుడు హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన ఎందరో నటీమణులు.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా అవార్డులు కూడా సొంతం చేసుకుంటున్నారు. వాస్తవానికి చూస్తే హీరోయిన్లకు హీరోల కంటే తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఇండస్ట్రీ ఏదైనా సంగతి ఇంతే. ప్రస్తుతం టాలీవుడ్‌లో జరుగుతున్న ట్రెండ్‌ను పరిశీలిస్తే.. గత ఐదు సంవత్సరాల్లో ఎందరో కొత్త హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో కొంతమంది ఇండస్ట్రీలో పాతుకుపోతే.. మరికొందరు చిన్నా చితక సినిమాలతోనే కనుమరుగయ్యారు. అంతేకాకుండా కొన్నేళ్ళకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తల్లి, చెల్లి, సపోర్టింగ్ రోల్స్‌‌కు పరిమితమయ్యారు. వాళ్లలో కొంతమంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.రమ్యకృష్ణ

ఘరానా బుల్లోడు, హలో బ్రదర్, చంద్రలేఖ, అన్నమయ్య.. ఇలా ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది నటి రమ్యకృష్ణ. 1990-2000 సంవత్సరం వరకు దాదాపు దశాబ్దం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలిగిపోయింది. ఇక ఆ తర్వాత 2002వ సంవత్సరంలో దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపొయింది. అయితే పెళ్లి తర్వాత కూడా అడపాదడపా చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరించిన ఈ సీనియర్ హీరోయిన్‌కు రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలోని శివగామి పాత్ర దక్కింది. అంటే ఆ సినిమా రిలీజయ్యింది. ఆ తర్వాత పరిస్థితి ఏంటో అందరికి తెలిసిందే. బాహుబలిగా ప్రభాస్, భల్లాలదేవగా రానా ఎంత పాపులర్ అయ్యారో.. శివగామిగా రమ్యకృష్ణ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఆ పాత్రలో ఆమెను తప్ప మరెవరిని ఊహించలేని విధంగా అద్భుతంగా నటించారు. ‘బాహుబలి’ సినిమాతో ఆమెకు డిమాండ్ పెరిగింది. దర్శకులు ఆమె కోసం ప్రత్యేకమైన పాత్రలను రూపొందిస్తున్నారు.

2.మధుబాల

నటి మధుబాల అంటే.. ఠక్కున గుర్తొచ్చేది అరవింద స్వామి హీరోగా దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘రోజా’ చిత్రం. ఈ సినిమాలో ఆమె నటనకు గానూ ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా దక్కింది. క్రిటిక్స్ సైతం ఆమె అద్భుత నటనకు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘అల్లరి ప్రియుడు’, ‘జెంటిల్‌మెన్’ వంటి పలు కమర్షియల్ సినిమాలు తీసి విజయాలు అందుకున్న మధుబాల.. 2001లో సినిమాలకు దూరమయ్యింది. అయితే మళ్ళీ 2008లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె తెలుగులో ‘అంతకముందు.. ఆ తర్వాత’, ‘సూర్య వెర్సస్ సూర్య’, ‘నాన్నకు ప్రేమతో’ లాంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి మెప్పించింది.

3.నదియా

తమిళంలో టాప్ హీరోయిన్‌గా పేరుగాంచిన నదియా.. తను చేసిన మొదటి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డును దక్కించుకుంది. మలయాళ, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఈమె కేర్ అఫ్ అడ్రెస్. రెండు ఇండస్ట్రీలలోనూ ఎంతోమంది స్టార్స్, సూపర్‌స్టార్స్ సరసన నటించి మెప్పించింది. 1994లో సినిమాలకు దూరమైన నదియా 2004లో మళ్ళీ రీ-ఎంట్రీ ఇచ్చింది. తల్లి క్యారెక్టర్స్, సపోర్టింగ్ రోల్స్ చేసి ప్రేక్షకుల మన్నలు పొందింది. అంతేకాకుండా ఆమెకు పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’, వెంకటేష్ నటించిన ‘దృశ్యం’ సినిమాలకు అవార్డులు వరించాయి.

4.లక్ష్మీ

రమ్యకృష్ణ తర్వాత చెప్పుకోవాల్సిన నటి ఎవరైనా ఉన్నారంటే ఆమె సీనియర్ హీరోయిన్ లక్ష్మీ. తాజాగా ఆమె నటించిన ప్రతి సినిమా హిట్ కావడం విశేషం. ఆమె ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయి మరీ నటిస్తున్నారు. మొన్నటికి మొన్న సమంతా హీరోయిన్‌గా వచ్చిన ‘ఓ బేబీ’ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు లభించాయి. తాజాగా వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో కూడా ఆమె నటన అమోఘమని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ సీనియర్ హీరోయిన్ సపోర్టింగ్ రోల్స్‌లో అదరగొడుతోంది.

5.సుప్రియా యార్లగడ్డ

పవన్ కళ్యాణ్ మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సుప్రియా యార్లగడ్డ. ఈ చిత్రం తర్వాత పెద్దగా సినిమాలు చేయకపోయినా అక్కినేని నాగార్జున మేనకోడలుగా అందరికి సుపరిచితమే. అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను చూసుకుంటున్న ఈమె అడివి శేష్ హీరోగా వచ్చిన ‘గూఢచారి’ సినిమాతో మళ్ళీ తెలుగు తెరకు రీ-ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే దక్కాయి.

ఇలా ఒకరు.. ఇద్దరూ కాదు చాలామంది హీరోయిన్లు తమ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎన్నో అపురూపమైన పాత్రల్లో నటించి మెప్పించారు. పవిత్ర లోకేష్, సుహాసిని, జయసుధ, మీనా, జ్యోతిక, కుష్బూ, శరణ్య, రేవతి, రాశి, రోహిణి లాంటి వారు తమ సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు