‘ప్లాస్మా దాతలారా’ ముందుకు రండి.. ప్రాణాలను కాపాడండి..
ఇక కరోనా బారిన పడి.. చికిత్స తీసుకుని కోలుకున్నవారు ప్లాస్మాను దానం చేయడం ద్వారా కోవిడ్ బాధితులను కాపాడవచ్చని పలువురు ఆరోగ్య నిపులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో కరోనా వారియర్స్ ముందుకు రావాలంటూ టాలీవుడ్ సెలబ్రిటీలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, అమల..
ప్రజలను పట్టి పీడిస్తోంది కరోనా మహమ్మారి. ఈ వైరస్ గురించి ప్రస్తావిస్తేనే.. జనాలు హడలెత్తిపోతున్నారు. దేశ వ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకీ రికార్డు స్తాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు 14 లక్షలు దాటేశాయి. ఇప్పటికీ కరోనా కట్టడిని అరికట్టేందుకు సరైన వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇప్పటికే సామాన్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, పోలీసులు, వైద్యులు ఇలా అందరూ ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనాను ఎదుర్కొనాలంటే ఇమ్యునిటీ పవర్ మస్ట్ అని వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు.
ఇక కరోనా బారిన పడి.. చికిత్స తీసుకుని కోలుకున్నవారు ప్లాస్మాను దానం చేయడం ద్వారా కోవిడ్ బాధితులను కాపాడవచ్చని పలువురు ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో కరోనా వారియర్స్ ముందుకు రావాలంటూ టాలీవుడ్ సెలబ్రిటీలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, అమల, సాయితేజ్ తదితరులు ప్లాస్మా దానం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.ఇప్పుడు వీరితో పాటుగామరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ప్లాస్మా దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ప్లాస్మాను దానం చేయాలని సైబరాబాద్ పోలీస్ శాఖ ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదే వీడియోను వెంకటేష్ కూడా షేర్ చేస్తూ..ప్లాస్మా దాతలు ముందుకు రావాలని.. ప్రాణాలను కాపాడాలని ట్వీట్ చేసి పోస్ట్ చేశారు.
All the COVID-19 survivors to step forward & donate their plasma to help save lives. #DonatePlasmaSaveLives https://t.co/xnhXOlE3tb
— Venkatesh Daggubati (@VenkyMama) July 27, 2020
Read More: