ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కన్నుమూత
సీనియర్ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్(82) కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కర్నూల్ జిల్లా ఆదోనీకి చెందిన శ్రీను మాస్టర్.. ప్రముఖ కొరియోగ్రాఫర్ హీరాలాల్ దగ్గర శిష్యరికం చేశారు. 1969లో నిర్మాత డూండి రూపొందించిన నేనేంటే నేనే చిత్రంతో డ్యాన్స్ మాస్టర్గా శ్రీను ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. ఆ తరువాత మహా బలుడు, భక్త కన్నప్ప, దొరబాబు, ఎదురులేని మనిషి, యుగంధర్, యుగ పురుషుడు సహా మొత్తం 1700 చిత్రాలకు […]
సీనియర్ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్(82) కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కర్నూల్ జిల్లా ఆదోనీకి చెందిన శ్రీను మాస్టర్.. ప్రముఖ కొరియోగ్రాఫర్ హీరాలాల్ దగ్గర శిష్యరికం చేశారు. 1969లో నిర్మాత డూండి రూపొందించిన నేనేంటే నేనే చిత్రంతో డ్యాన్స్ మాస్టర్గా శ్రీను ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. ఆ తరువాత మహా బలుడు, భక్త కన్నప్ప, దొరబాబు, ఎదురులేని మనిషి, యుగంధర్, యుగ పురుషుడు సహా మొత్తం 1700 చిత్రాలకు ఆయన పనిచేశారు. స్వర్ణ కమలం, రాధా గోపాలం, శ్రీరామరాజ్యం చిత్రాలకు గానూ బెస్ట్ కొరియోగ్రాఫర్గా ఆయన నంది అవార్డులను అందుకున్నారు. కాగా ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు విజయ్ శ్రీనివాస్ ఉండగా.. విజయ్ శ్రీనివాస్ దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం చెన్నైలో శ్రీను మాస్టర్ పార్ధీవ దేహానికి ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి.