కరోనా.. ఢిల్లీ ఎయిమ్స్ లో సీనియర్ డాక్టర్ పాండే మృతి
కరోనా వైరస్ తో ఢిల్లీ ఎయిమ్స్ లో పని చేసే సీనియర్ డాక్టర్ జితేంద్ర నాథ్ పాండే మృతి చెందారు. ఆయన వయస్సు 78 ఏళ్ళు. పల్మనాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ కూడా అయిన డాక్టర్ పాండే మృతిని..
కరోనా వైరస్ తో ఢిల్లీ ఎయిమ్స్ లో పని చేసే సీనియర్ డాక్టర్ జితేంద్ర నాథ్ పాండే మృతి చెందారు. ఆయన వయస్సు 78 ఏళ్ళు. పల్మనాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ కూడా అయిన డాక్టర్ పాండే మృతిని మరో సీనియర్ డాక్టర్ సంగీతా రెడ్డి ధృవీకరించారు. ఆయన మరణాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని, వైద్య వృత్తిలో ఆయన అపారమైన అనుభవం కలిగినవారని ఆమె ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఎయిమ్స్ క్యాంటీన్ లో పని చేసే ఓ మెస్ వర్కర్ కరోనా వైరస్ తో మృతి చెందిన మరునాడే పాండే కూడా కన్ను మూశారు. ఢిల్లీలో ఇప్పటికే కరోనా రోగులకు సేవలందిస్తున్న ఆసుపత్రుల్లోని పలువురు డాక్టర్లు, హెల్త్ వర్కర్లు కరోనాకు గురయ్యారు.
Deeply saddened to hear that today @covid19 claimed it’s most illustrious victim Dr. J.N Pande Director & Prof of Pulmonology @aiims_newdelhi A stalwart of the medical world his work in pulmonology will continue to ensure better health for many
My Condolences to his family? pic.twitter.com/ByE83ikItS
— Dr. Sangita Reddy (@drsangitareddy) May 23, 2020