సీజ్ చేసిన వాహనాలతో కిటకిటలాడుతోన్న పోలీస్ స్టేషన్లు..అవి ఎప్పుడు ఇస్తారంటే..
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి.. అలాగని నిర్లక్ష్యంగా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది.. కానీ జనం మాత్రం ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. చిన్నచిన్న కారణాలతో రోడ్డు మీదకు వస్తున్నారు.. అందుకే ట్రాఫిక్ పెరిగిపోతుంది.. అసలు లాక్డౌన్లా అనిపించడం లేదు.. ఇదే సమయంలో లాక్డౌన్ ఉల్లంఘన కేసులు కూడా పెరుగుతున్నాయి.. పనీపాటా లేకుండా బండేసుకుని రోడ్డు మీదకు వచ్చేవారిపై కేసులు పెట్టడమే కాకుండా వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు.. స్వాధీనం చేసుకున్న […]
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి.. అలాగని నిర్లక్ష్యంగా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది.. కానీ జనం మాత్రం ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. చిన్నచిన్న కారణాలతో రోడ్డు మీదకు వస్తున్నారు.. అందుకే ట్రాఫిక్ పెరిగిపోతుంది.. అసలు లాక్డౌన్లా అనిపించడం లేదు.. ఇదే సమయంలో లాక్డౌన్ ఉల్లంఘన కేసులు కూడా పెరుగుతున్నాయి.. పనీపాటా లేకుండా బండేసుకుని రోడ్డు మీదకు వచ్చేవారిపై కేసులు పెట్టడమే కాకుండా వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు.. స్వాధీనం చేసుకున్న వాహనాలతో పోలీసుస్టేషన్లు నిండిపోతున్నాయి.. రోజుకు వేల సంఖ్యలో వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.
ఇకపోతే సీజ్ చేసిన వెహికిల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని..లాక్ డౌన్ ప్రభుత్వం ఎప్పుడు ముగిస్తుందో అప్పుడు మాత్రమే వెహికల్స్ తిరిగి వెనక్కి ఇవ్వడం జరుగుతుందని పోలీసు అధికారులు చెప్తున్నారు. లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్-1897 ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.