అరుణాచల్ ప్రదేశ్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం
అరుణాచల్ ప్రదేశ్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది భారత సైన్యం. అరుణాచల్ ప్రదేశ్ పోలీసులతో కలిసి చాంగ్లాంగ్ జిల్లాలోని మియావ్ బం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఈ ప్రాంతంలో ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి డంప్లు ఉన్నాయన్న పక్కా సమాచారం అందడంతో.. భారత సైన్యం, స్థానిక పోలీసులతో కలిసి కూంబింగ్ చేపట్టింది. ప్రతికూల వాతావరణంలో కూడా భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు బుధవారం నాడు.. ఓ డంప్ను గుర్తించారు. అక్కడి […]
అరుణాచల్ ప్రదేశ్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది భారత సైన్యం. అరుణాచల్ ప్రదేశ్ పోలీసులతో కలిసి చాంగ్లాంగ్ జిల్లాలోని మియావ్ బం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఈ ప్రాంతంలో ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి డంప్లు ఉన్నాయన్న పక్కా సమాచారం అందడంతో.. భారత సైన్యం, స్థానిక పోలీసులతో కలిసి కూంబింగ్ చేపట్టింది. ప్రతికూల వాతావరణంలో కూడా భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు బుధవారం నాడు.. ఓ డంప్ను గుర్తించారు. అక్కడి నుంచి ఓ ఏకే-47 రైఫిల్తో పాటు.. 115 రౌండ్ల బుల్లెట్లు, ఇతర ఆయుధ సామాగ్రితో పాటు.. మందు గుండు సామాగ్రి, పలు మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. హ్యాండ్ గ్రేనేడ్తో పాటు.. అండర్ బారెల్ గ్రేనేడ్ లాంచర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు.