ప్రజలంతా సంతోషంగా ఉంటారు: ‘అమ్మ’ పలుకు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. ఇవాళ రంగంలో భాగంగా అమ్మవారి భక్తురాలు స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది వర్షాలు బాగాపడతాయని.. ప్రజలందరూ సంతోషంగా ఉంటారని స్వర్ణలత తెలిపారు. గంగాదేవికి జలాభిషేకం చేయండి.. తప్పకుండా కోరికలు తీరుతాయని ఆమె తెలిపారు. ఐదు వారాలు సాకలతో, పప్పు బెల్లాలతో తనకు పూజలు జరిపించాలని కోరింది. తన అక్కచెల్లెళ్లు దూరంగా వెళ్లకుండా, తనకు దగ్గరగానే ఉండి పూజలు జరిపించాలని సూచించింది. భవిష్యత్తులో ప్రజలకు […]
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. ఇవాళ రంగంలో భాగంగా అమ్మవారి భక్తురాలు స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది వర్షాలు బాగాపడతాయని.. ప్రజలందరూ సంతోషంగా ఉంటారని స్వర్ణలత తెలిపారు. గంగాదేవికి జలాభిషేకం చేయండి.. తప్పకుండా కోరికలు తీరుతాయని ఆమె తెలిపారు. ఐదు వారాలు సాకలతో, పప్పు బెల్లాలతో తనకు పూజలు జరిపించాలని కోరింది. తన అక్కచెల్లెళ్లు దూరంగా వెళ్లకుండా, తనకు దగ్గరగానే ఉండి పూజలు జరిపించాలని సూచించింది. భవిష్యత్తులో ప్రజలకు ఎటువంటి ఆపదలూ రాకుండా చూసుకుంటానని, తనకు మారు బోనాన్ని తప్పకుండా ఇవ్వాలని అమ్మ సూచించింది. ఇక గతేడాది పూజలతో కాస్త బాధపడ్డానని తెలిపిన స్వర్ణలత.. ఈ సంవత్సరం తాను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు.