వీధి వ్యాపారులు రుణాలు పొందేందుకు ఎస్సీబీ సాయం
కోవిడ్ మహమ్మారి ప్రజల జీవనోపాధిని దెబ్బతీసిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా ప్రధానంగా నష్టపోయిన వారిలో వీధి వ్యాపారులు కూడా ఉన్నారు. వారు ఇప్పుడు ఆర్థికంగా తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు.
కోవిడ్ మహమ్మారి ప్రజల జీవనోపాధిని దెబ్బతీసిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా ప్రధానంగా నష్టపోయిన వారిలో వీధి వ్యాపారులు కూడా ఉన్నారు. వారు ఇప్పుడు ఆర్థికంగా తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వీధి వ్యాపారులకు ఆర్థికంగా తోడ్పాటునందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి వీధి విక్రేతల ఆత్మ నిర్భర్ నిధి పథకాన్ని ప్రారంభించింది. అయినప్పటికీ, చాలా మంది వీధి వ్యాపారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ (ఎస్సీబీ) అర్హులు రుణాలు పొందటానికి, వారి పేర్లను నమోదు చేసుకోవడానికి సహాయం చేస్తోంది.
ఎస్సీబీ ఎన్నికల సమన్వయ అధికారి పరుశురామ్ మాట్లాడుతూ.. “వీధి వ్యాపారులు తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించడానికి, రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎస్సీబీ సాయం చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద రూ .10,000 రుణ మొత్తాన్ని పొందవచ్చు. ఏడు శాతం వడ్డీ రేటుతో 12 వాయిదాల్లో తిరిగి చెల్లించవచ్చు. వీధి వ్యాపారులను గుర్తించడానికి ఎస్సీబీ ఆగస్టులో ఒక సర్వే నిర్వహించింది. అంతేకాదు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఎనిమిది వార్డులలోని ప్రతి వీధిలో ఈ పథకం గురించి అవగాహన కల్పించింది. ప్రతి స్ట్రీట్ వెండర్ ఆచూకీని ఎస్సీబీ గుర్తించింది” అని తెలిపారు.
కంటోన్మెంట్ ప్రాంతంలో 5,000 మంది వీధి వ్యాపారులను నమోదు చేయాలని ఎస్సీబీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 3,500 మందిని గుర్తించి నమోదు చేశారు. ఈ డేటాను ఆర్థిక సహాయం కోసం హైదరాబాద్ కలెక్టర్కు పంపుతారు. ఎస్సీబీలో రిజిస్ట్రేషన్ చేయడానికి సెప్టెంబర్ 21 చివరి తేదీ. అయినా కూడా ఇప్పుడు ఎవరైనా వీధి వ్యాపారులు మమ్మల్ని సంప్రదించినట్లయితే వారి పేర్లు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. విక్రేతను నమోదు చేయడానికి ఆధార్ కార్డు, పాస్బుక్, స్టాల్ల ఫోటోను సమర్పించాలి. ప్రధాన్ మంత్రి వీధి విక్రేతలు ఆత్మ నిర్భర్ నిధికి గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పూర్తి నిధులు సమకూరుస్తుంది.
Also Read :
Bigg Boss Telugu 4 : కుమార్ సాయికి అదే బలంగా మారిందా..?
సీఎం జగన్ మరో విప్లవాత్మక పథకం, సెప్టెంబర్ 28న శ్రీకారం