అయోధ్యలో హై టెన్షన్.. రెండు నెలల పాటు 144 సెక్షన్ విధింపు..!

రాజకీయంగా సున్నితమైన అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు తుది దశకు చేరుకున్నాయి. వారం రోజుల దసరా సెలవుల తర్వాత అత్యున్నత న్యాయస్థానంలో ఇవాళ 38వ రోజు వాదనలు ప్రారంభం కానున్నాయి. రెండు పక్షాలు ఈ నెల 17వ తేదీ లోపు వాదనలు పూర్తి చేయాలని ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తుది తీర్పును నవంబరు 17వ తేదీన వెల్లడిస్తానని తెలిపింది. ఇక రంజన్‌ గొగోయ్‌ అదే రోజు రిటైర్మెంట్‌ తీసుకోనున్నారు. తుది […]

అయోధ్యలో హై టెన్షన్.. రెండు నెలల పాటు 144 సెక్షన్ విధింపు..!
Follow us

| Edited By:

Updated on: Oct 14, 2019 | 7:57 AM

రాజకీయంగా సున్నితమైన అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు తుది దశకు చేరుకున్నాయి. వారం రోజుల దసరా సెలవుల తర్వాత అత్యున్నత న్యాయస్థానంలో ఇవాళ 38వ రోజు వాదనలు ప్రారంభం కానున్నాయి. రెండు పక్షాలు ఈ నెల 17వ తేదీ లోపు వాదనలు పూర్తి చేయాలని ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తుది తీర్పును నవంబరు 17వ తేదీన వెల్లడిస్తానని తెలిపింది. ఇక రంజన్‌ గొగోయ్‌ అదే రోజు రిటైర్మెంట్‌ తీసుకోనున్నారు.

తుది తీర్పుకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అయోధ్యలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు అయోధ్యలో 144 సెక్షన్‌ను అమలు చేయనున్నట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది. కాగా ఇప్పటి వరకూ 37 సార్లు అయోధ్య వివాదం పై సుప్రీంలో వాదోపవాదనలు జరిగాయి. అయినప్పటికీ కేసులో పురోగతి లేదు. దీంతో నవంబర్ 17వ తేదీ నాటికి ఈ వివాదం పై తీర్పు ప్రకటిస్తామని.. రంజన్ గగోయ్ డెడ్ లైన్ పెట్టారు. ఇక నేటి నుంచి మొదటి మూడు రోజులు హిందూ సంఘాలు, ముస్లిం కమిటీలు తమ వాదనలను వినిపించే అవకాశం కల్పించింది. వీరి వాదనలు విన్న తర్వాత గురువారం తుది విచారణను నిర్వహిస్తామని రంజన్ గగోయ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. ఎలాంటి తీర్పు ప్రకటించినా అన్ని వర్గాల ప్రజలు స్వాగతించడానికి సిద్దంగా ఉండాలని అధికారులు, రాజకీయ నాయకులు కోరుతున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..