Delhi Schools: ఢిల్లీలో 18 నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు.. ఆ తరగతి విద్యార్థులకు మాత్రమే అనుమతి

Delhi Schools:కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూత పడ్డాయి. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా అన్ని రంగాలు తెరుచుకున్నప్పటికీ, విద్యాసంస్థలు...

Delhi Schools: ఢిల్లీలో 18 నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు.. ఆ తరగతి విద్యార్థులకు మాత్రమే అనుమతి
Schools Reopen
Follow us

|

Updated on: Jan 13, 2021 | 7:31 PM

Delhi Schools: కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూత పడ్డాయి. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా అన్ని రంగాలు తెరుచుకున్నప్పటికీ, విద్యాసంస్థలు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారానే విద్యార్థులకు బోధన కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాలు విద్యాసంస్థలు తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 18వ తేదీ నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. 10,12 తరగతుల విద్యార్థులకు తరగతులు కొనసాగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

రాబోయే బోర్డు పరీక్షలు, ప్రీబోర్డ్‌ పరీక్షలు, ప్రాక్టికల్‌ వర్క్‌ సన్నాహకాలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సుమారు తొమ్మిది నెలల తర్వాత 10,12 తరగతుల విద్యార్థులు పాఠశాలల బాట పట్టనున్నారు. ఈనెల 18 నుంచి విద్యాసంస్థలకు అనుమతి ఇచ్చిన ఢిల్లీ సర్కార్‌.. విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి, అవసరమైన కరోనా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు పిలవాలని ఆయా విద్యాసంస్థలను కోరింది. విద్యార్థుల విషయంలో ఎలాంటి బలవంతం చేయరాదని సూచించింది. విద్యార్థుల హాజరుపై పాఠశాలలు రికార్డులు మెయింటన్‌ చేయాలని తెలిపింది. పాఠశాలలు తెరుచుకున్నాక కోవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించింది. శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

Central Cabinet: భారత వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు తేజస్‌ ఫైటర్‌ జెట్లు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు