తెలంగాణలో రేపటి నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం..
అన్లాక్ 4.0లో భాగంగా తెలంగాణలో రేపటి నుండి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 50 శాతం ఉపాధ్యాయుల రేపటి నుంచి పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంది.
అన్లాక్ 4.0లో భాగంగా తెలంగాణలో రేపటి నుండి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 50 శాతం ఉపాధ్యాయుల రేపటి నుంచి పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాలోని ఎంఈఓలు, హెడ్ మాస్టర్స్, ప్రైమరీ, యూపీ, జడ్పీహెచ్ఎస్, మోడల్ పాఠశాలల ప్రిన్సిపాల్లు, కెజిబివి ప్రత్యేకాధికారులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. అటు పీహెచ్సీ టీచర్లకు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు పాఠశాలలకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. (Schools And Colleges To Be Reopen)
అలాగే 9,10 తరగతుల విద్యార్థులు సందేహాలు నివృత్తి చేసుకోవడం కోసం పాఠశాలలు, కళాశాలలకు వెళ్లవచ్చునని.. అది కూడా వారి తల్లిదండ్రుల లిఖితపూర్వక అంగీకారం ఖచ్చితంగా ఉండాలని ప్రభుత్వం వెల్లడించింది. కాగా, స్టూడెంట్స్ కోవిడ్ 19 నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని ఉపాధ్యాయులను సూచించింది.
Also Read:
మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..
శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..