సివిల్ సర్వీసెస్ పరీక్షల వాయిదాకు సుప్రీం నిరాకరణ
అక్టోబర్ 4న జరగాల్సిన యూపీఎస్సీ ప్రాథమిక పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలన్న 20మంది యూపీఎస్సీ ఆశావహుల అభ్యర్థనను తోసిపుచ్చింది.
అక్టోబర్ 4న జరగాల్సిన యూపీఎస్సీ ప్రాథమిక పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలన్న 20మంది యూపీఎస్సీ ఆశావహుల అభ్యర్థనను తోసిపుచ్చింది. ప్రస్తుతం జరగాల్సిన పరీక్షను 2021 పరీక్షలతో జరపాలన్న వాదనను అత్యున్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. ఇలాంటి నిర్ణయాల వల్ల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ బీఆర్ గావై, జస్టిస్ కృష్ణమూర్తితో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.
అయితే కరోనా కారణంగా పరీక్షకు హాజరుకాలేని అభ్యర్థులకు మరోసారి ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించడాన్ని పరిశీలించాలని కేంద్రానికి సుప్రీం సూచించింది. కాగా పరీక్షను వాయిదా వేయడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని యూపీఎస్సీ గతంలోనే స్పష్టం చేసింది. ఇప్పటికే ఓసారి ఎగ్జామ్ వాయిదా పడినందున మరోసారి అలా చేయడం కుదరదని తేల్చి చెప్పింది. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు యూపీఎస్సీ కోర్టుకు వివరించింది.
Also Read :
టీటీడీ అర్చకునికి 6 నెలల జైలు శిక్ష
వాహనదారులకు అలెర్ట్, అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్