ఎస్బీఐ వడ్డీ రేట్లు తగ్గింపు… ఎవరికి నష్టం..ఎవరికి లాభమో తెలుసుకోండి..
ఇండియాలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ.. అన్ని రకాల పొదుపు అకౌంట్స్ పై 0.25 శాతం మేర ఇంట్రస్ట్ రేట్స్ తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పొదుపు సంవత్సర ఇంట్రస్ట్ రేటు ప్రజంట్ ఉన్న 3 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గిపోనుంది. కాగా ఈ నూతన వడ్డీరేట్లు 2020 ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వస్తాయని ఎస్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం ద్రవ్య లభ్యత ఎక్కువగా ఉన్న కారణంగా సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ […]
ఇండియాలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ.. అన్ని రకాల పొదుపు అకౌంట్స్ పై 0.25 శాతం మేర ఇంట్రస్ట్ రేట్స్ తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పొదుపు సంవత్సర ఇంట్రస్ట్ రేటు ప్రజంట్ ఉన్న 3 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గిపోనుంది. కాగా ఈ నూతన వడ్డీరేట్లు 2020 ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వస్తాయని ఎస్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం ద్రవ్య లభ్యత ఎక్కువగా ఉన్న కారణంగా సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ స్పష్టం చేసింది.
ఎంసీఎల్ఆర్ కూడా భారీ తగ్గింపు
ఎస్బీఐ మంగళవారం ఎంసీఎల్ఆర్నూ 0.35 శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీనితో హౌజ్ లోన్స్ తో పాటు ఇతర రుణాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. వార్షిక ఎంసీఎల్ఆర్ ప్రస్తుతం ఉన్న 7.75 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గుతుందని తెలిపింది. తగ్గించిన రేటు 2020 ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తుందని ఎస్బీఐ వెల్లడించింది. తాజా చర్య ద్వారా 2019-20 సంవత్సరంలో ఎంసీఎల్ఆర్లో వరుసగా 11వ సారి కోత విధించినట్లైందని ఎస్బీఐ తెలిపింది. అర్హత గల గృహ రుణగ్రహీతలకు…. ఇంట్రస్ట్ రూ.లక్షకు సుమారు రూ.24 వరకు తగ్గనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. కొత్తగా లోన్స్ తీసుకునేవారికి ఇది గుడ్ న్యూసే.