వినియోగదారులకు షాక్.. జనవరి 1 నుంచి చిప్ కార్డులు బ్లాక్!
డెబిట్ కార్డ్ వినియోగదారులు హెచ్చరిక! మీరు ఎస్బీఐ, పిఎన్బి, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ లేదా ఇతర బ్యాంకుల డెబిట్ కార్డు వినియోగదారులారా? అయితే ఈ ముఖ్య గమనిక మీకోసమే! అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు 2020 జనవరి 1 తర్వాత ఇఎంవి (యూరోపే, మాస్టర్ కార్డ్, వీసా) లేని డెబిట్ కార్డులను బ్లాక్ చేస్తున్నాయి. దీంతో ఇఎంవి కాని చిప్ డెబిట్ కార్డును ఉపయోగించే వినియోగదారులు ఏటీఎంల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునే సమయంలో సమస్యలు […]
డెబిట్ కార్డ్ వినియోగదారులు హెచ్చరిక! మీరు ఎస్బీఐ, పిఎన్బి, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ లేదా ఇతర బ్యాంకుల డెబిట్ కార్డు వినియోగదారులారా? అయితే ఈ ముఖ్య గమనిక మీకోసమే! అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు 2020 జనవరి 1 తర్వాత ఇఎంవి (యూరోపే, మాస్టర్ కార్డ్, వీసా) లేని డెబిట్ కార్డులను బ్లాక్ చేస్తున్నాయి. దీంతో ఇఎంవి కాని చిప్ డెబిట్ కార్డును ఉపయోగించే వినియోగదారులు ఏటీఎంల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునే సమయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) మార్గదర్శకాల ప్రకారం, అన్ని భారతీయ బ్యాంకులు తమ వినియోగదారుల మాగ్నెటిక్ డెబిట్ కార్డులను కొత్త ఇఎంవి కార్డుతో భర్తీ చేయాల్సి ఉంది. అంతర్జాతీయ చెల్లింపు ప్రమాణాలకు అనుగుణంగా మాగ్నెటిక్ డెబిట్ కార్డులను రీప్లేస్ చేయడం తప్పనిసరి. అందుకే ఆర్బీఐ.. మాగ్నెటిక్ డెబిట్ కార్డును ఉపయోగిస్తున్న ఎస్బిఐ, పిఎన్బి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్తో పాటుగా మిగిలిన బ్యాంకుల కస్టమర్లు తమ మాగ్నెటిక్ డెబిట్ కార్డును మార్చుకోవాలని సూచించింది. లేదంటే డబ్బును విత్ డ్రా చేసే సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డులపై జరుగుతున్న ఆన్లైన్ మోసాలను దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అన్ని భారతీయ బ్యాంకుల మాగ్నెటిక్ డెబిట్ కార్డులను 2019 డిసెంబర్ 31న డీయాక్టివేట్ చేయనుంది. కాబట్టి మీరు ఇంకా మీ డెబిట్ కార్డును మార్చుకోకపోతే వెంటనే రీప్లేస్ చేసుకోండి.