విండీస్కు చుక్కలు చూపిన ‘చిన్నోళ్లు’
ముక్కోణపు సిరీస్లో భాగంగా డబ్లిన్లో జరిగిన వన్డేలో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో విండీస్పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఓపెనర్ హోప్ (109; 11 ఫోర్లు, 1 సిక్స్) వరుసగా రెండో సెంచరీ చేశాడు. రోస్టన్ ఛేజ్ (51; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం సాధించాడు. బంగ్లా బౌలర్లలో మొర్తజా (3/49), సైఫుద్దీన్ (2/47) రాణించారు. అనంతరం […]
ముక్కోణపు సిరీస్లో భాగంగా డబ్లిన్లో జరిగిన వన్డేలో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో విండీస్పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఓపెనర్ హోప్ (109; 11 ఫోర్లు, 1 సిక్స్) వరుసగా రెండో సెంచరీ చేశాడు. రోస్టన్ ఛేజ్ (51; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం సాధించాడు. బంగ్లా బౌలర్లలో మొర్తజా (3/49), సైఫుద్దీన్ (2/47) రాణించారు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్కు ఓపెనర్లు తమీమ్ (80; 7 ఫోర్లు), సౌమ్య సర్కార్ (73; 9 ఫోర్లు, 1 సిక్స్) మంచి శుభారంభాన్ని ఇచ్చారు. వీరితో పాటు షకీబుల్ (61 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ తోడవ్వడంతో బంగ్లాదేశ్ 45 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.