పార్టీని తిట్టి పోసిన కాంగ్రెస్ నేత.. తొలగించిన అధిష్టానం
తన సొంత పార్టీపై నిప్పులు చెరిగిన సీనియర్ నేతను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించింది. ఏఐసీసీ స్పోక్స్ పర్శన్ పదవి నుంచి కూడా తీసేసింది. సంజయ్ ఝా అనే ఈ సీనియర్ నేత ఇటీవలి కాలంలో..
తన సొంత పార్టీపై నిప్పులు చెరిగిన సీనియర్ నేతను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించింది. ఏఐసీసీ స్పోక్స్ పర్శన్ పదవి నుంచి కూడా తీసేసింది. సంజయ్ ఝా అనే ఈ సీనియర్ నేత ఇటీవలి కాలంలో తమ పార్టీ పూర్తిగా విలువలను దిగజార్చిందని ఆరోపించారు. అసలు ఇప్పుడిది పార్టీయేనా అని తాను రాసిన ఓ ఆర్టికల్ లో ప్రశ్నించారు. నాటి పండిట్ నెహ్రు కాలం నాటి పార్టీ ఇది కాదని, రాజకీయ విలువలకు పూర్తిగా తిలోదకాలిచ్చిందని ఆయన ఆరోపించారు. పండిట్ నెహ్రూ ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలని, చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని, నియంతృత్వ విధానాలను తగవని చెప్పేవారని, కానీ ఆ పరిస్థితి ఇప్పుడు పార్టీలో లేదని ఆయన దుయ్యబట్టారు. అదే అసలైన కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు మానసిక, ‘శారీరక’ దౌర్బల్యంతో బాధ పడుతోందని, సరైన నాయకత్వం లేదని సంజయ్ ఝా విమర్శించారు. తనలాంటి గాంధేయ, నెహ్రూ ఫిలాసఫీని పాటిస్తున్న నేతలను దూరం పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
అయితే సంజయ్ ఝా ఆరోపణలను పార్టీ అధిష్టానం కొట్టి పారేసింది. సామర్థ్యం నిరూపించుకోలేని నేతలకు పార్టీలో స్థానం లేదని స్పష్టం చేసింది.