మళ్లీ రేస్‌లోకి సానియా..రాకెట్‌తో రెడీ..!

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా మళ్లీ రాకెట్ పట్టేందుకు సిద్ధమైంది. 2018 అక్టోబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా కొద్దికాలంగా ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె కాస్త బరువు కూడా పెరిగింది. మరోసారి కోర్టులోకి దిగి డబుల్స్‌ ప్లేయర్‌గా ఆరాటపడిన ఆమె తిరిగి ఫిట్‌గా మారేందుకు విపరీతంగా కష్టపడింది. రోజుకు 5 నుంచి 6 గంటల పాటు జిమ్‌లో వర్కవుట్లు చేసింది. దీంతో కేవలం 4 నెలల్లోనే 26 కేజీల బరువు తగ్గి […]

మళ్లీ రేస్‌లోకి సానియా..రాకెట్‌తో రెడీ..!
Follow us

|

Updated on: Jan 01, 2020 | 9:51 PM

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా మళ్లీ రాకెట్ పట్టేందుకు సిద్ధమైంది. 2018 అక్టోబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా కొద్దికాలంగా ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె కాస్త బరువు కూడా పెరిగింది. మరోసారి కోర్టులోకి దిగి డబుల్స్‌ ప్లేయర్‌గా ఆరాటపడిన ఆమె తిరిగి ఫిట్‌గా మారేందుకు విపరీతంగా కష్టపడింది. రోజుకు 5 నుంచి 6 గంటల పాటు జిమ్‌లో వర్కవుట్లు చేసింది. దీంతో కేవలం 4 నెలల్లోనే 26 కేజీల బరువు తగ్గి ఔరా అనిపించింది. ఇప్పుడు పూర్తి పిట్‌గా మారిన సానియా ప్రత్యర్థులకు రెడీ అంటూ వార్నింగ్ ఇస్తోంది.

కాగా 2017లో చైనా ఓపెన్‌ సమయంలో సానియా మోకాలుకు గాయమైంది. ఆ తర్వాత ప్రెగ్నెంట్ అవ్వడంతో దాదాపు రెండున్నర ఏళ్లు టెన్నిస్‌కు దూరమైంది. తన కెరీర్‌లో ఇప్పటివరకు 6 గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్స్‌ తన ఖాతాలో వేసుకున్న సానియా..గతంలో మహిళల డబుల్స్‌ నెంబర్ ర్యాంకుని కూడా చేరుకుంది. కాగా ఇప్పుడు ఫూర్తి ఫిట్‌నెస్ సాధించిన ఈ ఏస్ టెన్నిస్ ప్లేయర్..జనవరి 11 నుంచి జరిగనున్న డబ్ల్యూటీఏ హోబర్ట్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో ఆడేందుకు సిద్దమైంది. మహిళల డబుల్స్‌ కేటగిరిలో నదియా కిచెనక్‌ (ఉక్రెయిన్‌)తో కలిసి.. మిక్స్‌డ్‌ కేటగిరిలో రాజీవ్‌ రామ్‌ (అమెరికా)తో కలిసి రేస్‌లోకి దిగబోతుంది.