అత్యాచారానికి గురైన ప్రముఖ నటి.. పరారీలో నిందితుడు
పలు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన ప్రముఖ నటిపై ఓ కార్పోరేట్ కంపెనీ సీఈవో అత్యాచారం చేశాడు. అంతేకాదు వీడియో తీసి బెదిరించి, ఆ నటి నుంచి డబ్బులను రాబట్టాడు.
పలు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన ప్రముఖ నటిపై ఓ కార్పొరేట్ కంపెనీ సీఈవో అత్యాచారం చేశాడు. అంతేకాదు వీడియో తీసి బెదిరించి, ఆ నటి నుంచి డబ్బులను రాబట్టాడు. దీన్ని భరించలేకపోయిన ఆ నటి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరులోని జేజే నగర్ పరిధిలో ఉంటున్న ఓ నటి(30) తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. 2018లో ఓ కార్పొరేట్ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తోన్న మోహిత్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే తన కంపెనీకి సదరు హీరోయిన్ని అంబాసిడర్గా నియమించాడు మోహిత్. ఇక కంపెనీ ప్రచారం నిమిత్తం ఆ నటిని పలు ప్రదేశాలకు తీసుకెళ్లాడు. గతేడాది జూన్ 22న మోహిత్ పుట్టినరోజు కాగా తన ఇంట్లోనే పార్టీని ఇచ్చాడు. ఆ తరువాతి రోజు ఆమె పుట్టినరోజు కాగా.. ఇద్దరు కలిసి ఏకాంతంగా పార్టీ చేసుకున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న మోహిత్.. కూల్డ్రింక్లో మత్తు మందు కలిపి ఆమెకు తాగించాడు. ఆమె మత్తులోకి జారుకున్నాక అత్యాచారం చేశాడు. ఆ తతంగాన్నంతా సెల్ఫోన్లో వీడియో తీశాడు.
వాటితో నటిని బ్లాక్మెయిల్ చేస్తూ సుమారు రూ.20లక్షల వరకు దోచుకున్నాడు. దీంతో తనకు సాయం చేస్తారన్న ఆశతో బాధితురాలు ఆ విషయాన్ని మోహిత్ తల్లిదండ్రులకు చెప్పింది. అయితే వారు కూడా బెదిరింపులకు దిగారు. దీంతో విసిగిపోయిన నటి మోహిత్తో పాటు అతడి తల్లిదండ్రులు మహాదేవ్, నాగవేణి, బంధువు రాహుల్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అయితే ఈ విషయం తెలిసి మోహిత్ పరారీ అవ్వగా.. అతడి కోసం గాలిస్తున్నారు. త్వరలోనే నిందితుడి కుటుంబసభ్యులను విచారిస్తామని పోలీసులు తెలిపారు.