మహబూబాబాద్‌ జిల్లాలో దారుణం.. దాహం తీర్చుకునేందుకు వచ్చిన వన్యప్రాణి కాళ్ళు నరికిన కిరాతకులు

మహబూబాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దాహం తీర్చుకునేందుకు వచ్చిన వన్య ప్రాణి కాళ్ళు కిరాతకంగా నరికారు కొందరు దుండగులు. వివరాల్లోకి వెళ్తే ..

మహబూబాబాద్‌ జిల్లాలో దారుణం.. దాహం తీర్చుకునేందుకు వచ్చిన వన్యప్రాణి కాళ్ళు నరికిన కిరాతకులు
Follow us

|

Updated on: Dec 02, 2020 | 9:16 AM

మహబూబాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దాహం తీర్చుకునేందుకు వచ్చిన వన్య ప్రాణి కాళ్ళు కిరాతకంగా నరికారు కొందరు దుండగులు. వివరాల్లోకి వెళ్తే  జిల్లాలోని కొత్తగూడ మండలం రేణ్యాతండా సమీపంలోని ఓ చెరువులో నీళ్లు తాగేందుకు సాంబర్ జింక రాగా కొందరు యువకులు పెద్దగా అరుస్తూ దాన్ని బెదరగొట్టారు. దాంతో భయపడిన సాంబర్ జింక చెరువులో దూకి ఈదుకుంటూ గట్టుమీదఉన్న పొలాల్లోకి వచ్చింది. బురద ఎక్కువ ఉండటంతో జింక పరిగెత్తలేక అక్కడే ఆగిపోయింది. గొడ్డళ్లతో వెంబడిస్తూ వచ్చిన దుండగులు సాంబర్ జింక వెనుక రెండు కాళ్ళను నరికారు.  సాంబర్ జింక గట్టిగా అరవడంతో స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దాంతో ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు..  జింకను హన్మకొండలోని వనవిజ్ఞాన కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.