కొత్త ఛాలెంజ్ చేపట్టిన సామ్.. మంచు లక్ష్మీ, రకుల్లకు సవాల్
ఇప్పటివరకూ ఎన్నో రకాల ఛాలెంజ్లు సెలబ్రిటీలతో పాటు, సామాన్యులు కూడా పాటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అక్కినేని వారి కోడలు సమంత మరో కొత్త ఛాలెంజ్కి శ్రీకారం చుట్టింది. 'గ్రో విత్ మీ' అనే ఛాలెంజ్ మొదలు పెట్టిన సామ్..
ఇప్పటివరకూ ఎన్నో రకాల ఛాలెంజ్లు సెలబ్రిటీలతో పాటు, సామాన్యులు కూడా పాటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అక్కినేని వారి కోడలు సమంత మరో కొత్త ఛాలెంజ్కి శ్రీకారం చుట్టింది. ‘గ్రో విత్ మీ’ అనే ఛాలెంజ్ మొదలు పెట్టిన సామ్.. తనలానే ఇంటిలో కూరగాయలు పెంచాలని పిలుపునిచ్చింది. ఈ ఛాలెంజ్కు ముందుగా ఆమె మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్లను నామినేట్చేసింది. ఇది మరింత ముందుకు పోతుందని సమంత ఆశాభావం వ్యక్తం చేసింది.
లాక్డౌన్ టైంలో సమంత అర్బన్ వ్యవసాయం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ స్వగృహంలోని టెర్రస్పై ఏర్పాటు చేసుకున్న తోటలో ఆమె సెంద్రీయ పద్దతుల్లో ఆకుకూరలతో పాటు కూరగాయల్ని కూడా పండించింది. మన ఆరోగ్యం కోసమే కాకుండా పర్యావరణ సంరక్షణ కోసమే తాను ఇంటివద్ద కూరగాయల్ని పండిస్తున్నట్లు పేర్కొంది.
ఇక ఈ జర్నీలో తనను ప్రోత్సహించిన ఫ్యాన్స్కు ఆమె థ్యాంక్స్ చెప్పింది. రాబోయే కొన్ని వారాల్లో సేంద్రీయ పద్దతుల్లో కూరగాయలు పండిద్దామని పిలుపునిచ్చింది. దీని కోసం ఓ కుండ, కొద్దిగా మట్టి, విత్తనాలు, ఖాళీ పాల ప్యాకెట్ లేదంటే హైడ్రోపోనిక్ హోం కిట్ సిద్ధం చేసుకుని అర్బన్ వ్యవసాయం చేయాలని సమంత చెప్పుకొచ్చింది.
Read More:
నాతో పాటు నా కూతురికి కూడా కరోనా సోకిందిః మాళవిక
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి.. ప్రధాని మోదీ నివాళి
వచ్చే మార్చి నాటికి దేశ వ్యాప్తంగా ‘వన్ నేషన్-వన్ రేషన్’