‘Zombie Reddy’ టీజర్ టాక్ : ‘దైవం నేర్పే గుణపాఠం’… విభిన్న కథతో రాబోతున్న’జాంబీరెడ్డి’
అ , కల్కి వంటి విభిన్నమైన కథలతో సినిమాలు చేసి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ త్వరలో 'జాంబీరెడ్డి' అనే సినిమాతో రాబోతున్నాడు. తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
అ , కల్కి వంటి విభిన్నమైన కథలతో సినిమాలు చేసి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ త్వరలో ‘జాంబీరెడ్డి’ అనే సినిమాతో రాబోతున్నాడు. తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, టీజర్ లాంచ్ కార్యక్రమం రామానాయుడు స్టూడియోలో జరిగింది. టాలీవుడ్ బ్యూటీ సమంత, బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. టీజర్ ను సమంత విడుదల చేయగా పోస్టర్ ను దిల్ రాజు రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ..’జాంబిరెడ్డి టీజర్ అదిరిపోయింది. నాకు చాలా బాగా నచ్చింది. విజువల్స్, మేకింగ్ వేల్యూస్ సూపర్బ్గా ఉన్నాయి. నాకు ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు సినిమాగా ఎలా తీస్తారు అనుకున్నాను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది. తేజకు సినిమా అంటే ప్రాణం, తేజకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని ఆశిస్తున్నాను.”అని అన్నారు.