సెంటిమెంట్‌తో కొట్టిన రాహుల్‌..ప్రతి అమ్మకు, సోదరికి..

ఢిల్లీ: నేడు జరుగుతున్న ఏడవ విడత ఎన్నికలతో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగియబోతోంది. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో భాగస్వాములైన మహిళలందరికీ సెల్యూట్ అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదివారం ట్వీట్‌ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన మహిళా అభ్యర్థులతో పాటు పెద్ద ఎత్తున్న ఓటింగ్‌లో పాల్గొన్న మహిళలకు  వందనాలంటూ ఆయన పేర్కొన్నారు. ‘ ఈ రోజు  ఏడవ విడతతో పాటు చివరి దశ పోలింగ్‌. దేశంలోని మన తల్లులు, సోదరీమణులంతా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర […]

సెంటిమెంట్‌తో కొట్టిన రాహుల్‌..ప్రతి అమ్మకు, సోదరికి..
Follow us

|

Updated on: May 19, 2019 | 4:29 PM

ఢిల్లీ: నేడు జరుగుతున్న ఏడవ విడత ఎన్నికలతో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగియబోతోంది. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో భాగస్వాములైన మహిళలందరికీ సెల్యూట్ అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదివారం ట్వీట్‌ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన మహిళా అభ్యర్థులతో పాటు పెద్ద ఎత్తున్న ఓటింగ్‌లో పాల్గొన్న మహిళలకు  వందనాలంటూ ఆయన పేర్కొన్నారు.

‘ ఈ రోజు  ఏడవ విడతతో పాటు చివరి దశ పోలింగ్‌. దేశంలోని మన తల్లులు, సోదరీమణులంతా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. కేవలం అభ్యర్థులుగా మాత్రమే కాకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. వారందిరికీ నా సెల్యూట్‌ ’ అంటూ ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు మాకు సమాన అవకాశాలు, గౌరవం కావాలంటూ మహిళలు కోరుతున్న ఓ వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. తుది విడతలో భాగంగా ఆదివారం దేశ వ్యాప్తంగా 59 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతోంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.