సెంటిమెంట్తో కొట్టిన రాహుల్..ప్రతి అమ్మకు, సోదరికి..
ఢిల్లీ: నేడు జరుగుతున్న ఏడవ విడత ఎన్నికలతో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగియబోతోంది. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో భాగస్వాములైన మహిళలందరికీ సెల్యూట్ అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఆదివారం ట్వీట్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన మహిళా అభ్యర్థులతో పాటు పెద్ద ఎత్తున్న ఓటింగ్లో పాల్గొన్న మహిళలకు వందనాలంటూ ఆయన పేర్కొన్నారు. ‘ ఈ రోజు ఏడవ విడతతో పాటు చివరి దశ పోలింగ్. దేశంలోని మన తల్లులు, సోదరీమణులంతా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర […]
ఢిల్లీ: నేడు జరుగుతున్న ఏడవ విడత ఎన్నికలతో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగియబోతోంది. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో భాగస్వాములైన మహిళలందరికీ సెల్యూట్ అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఆదివారం ట్వీట్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన మహిళా అభ్యర్థులతో పాటు పెద్ద ఎత్తున్న ఓటింగ్లో పాల్గొన్న మహిళలకు వందనాలంటూ ఆయన పేర్కొన్నారు.
‘ ఈ రోజు ఏడవ విడతతో పాటు చివరి దశ పోలింగ్. దేశంలోని మన తల్లులు, సోదరీమణులంతా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. కేవలం అభ్యర్థులుగా మాత్రమే కాకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. వారందిరికీ నా సెల్యూట్ ’ అంటూ ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. దీంతో పాటు మాకు సమాన అవకాశాలు, గౌరవం కావాలంటూ మహిళలు కోరుతున్న ఓ వీడియోను ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. తుది విడతలో భాగంగా ఆదివారం దేశ వ్యాప్తంగా 59 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.
Today is the 7th and last phase of polling. Our mothers and sisters have played a key role in these elections, not just as candidates, but also as committed voters whose voices must be heard. I salute them all. #AbHogaNYAY pic.twitter.com/2qspqzkKvY
— Rahul Gandhi (@RahulGandhi) May 19, 2019