సుశాంత్ కేసులో విచారణకు సల్మాన్..ఎంతవరకు నిజం..?
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య బాలీవుడ్ ను ఓ కుదుపు కుదిపేసింది. ఇప్పటికీ ఆయన అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు సుశాంత్ మృతిపై ముంబై పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య బాలీవుడ్ ను ఓ కుదుపు కుదిపేసింది. ఇప్పటికీ ఆయన అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు సుశాంత్ మృతిపై ముంబై పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సుశాంత్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, సన్నిహితులు, బాలీవుడ్ ప్రముఖులతో సహా 35 మందిని విచారించారు. తాజాగా బడా హీరో సల్మాన్ ఖాన్ను కూడా పోలీసులు విచారణకు పిలిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీనియర్ ఆఫిసర్.. సల్మాన్ ఖాన్పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కొట్టి పారేశారు. సుశాంత్ ఆత్మహత్యకు ముందు అనేక సినిమాలకు సైన్ చేశాడు. అయితే, కొంతమంది కుట్ర పన్ని అతడికి ఆ సినిమాలు దక్కకుండా చేసినట్టు నెటిజన్లు, కొంత మంది సినీ ప్రముఖులు సైతం ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖులను విచారించారు పోలీసులు. ఇటీవలే ఫేమస్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ వాంగ్మూలం తీసుకున్నారు. సుశాంత్ మరణం అనంతరం వచ్చిన పోస్ట్మార్టం రిపోర్టులో సుశాంత్ ఊపిరాడక మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు హీరో మరణం వెనుక మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరు హస్తం ఉందని ఇటీవల ‘రా’ మాజీ అధికారి ఆరోపించారు. ఏదేమైనా, రాజ్పుత్ సుశాంత్ సింగ్ మరణం వెనుక మిస్టరీ కొత్త చర్చలకు తావిస్తోంది.