#DhoniRetires.. ఎందుకు డిలీట్ చేశానంటే…
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు అతని సతీమణి సాక్షి సింగ్ చెక్ పెట్టారు. అలాగే 'ధోనీ రిటైర్స్' #DhoniRetires హాష్ ట్యాగ్పై తాను చేసిన ట్వీట్ గరించి వివరణ ఇచ్చారు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు అతని సతీమణి సాక్షి సింగ్ చెక్ పెట్టారు. అలాగే ‘ధోనీ రిటైర్స్’ #DhoniRetires హాష్ ట్యాగ్పై తాను చేసిన ట్వీట్ గురించి వివరణ ఇచ్చారు. అదే రోజు ఈ విషయంపై ధోని సతీమణి సాక్షి ట్విటర్లో స్పందించారు. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. లాక్డౌన్.. ప్రజల మానసిక పరిస్థితిని మార్చేసిందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. అయితే, ఆ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే సాక్షి దాన్ని డిలీట్ చేశారు. దీంతో సాక్షి ఎందుకలా చేశారనేదానిపై అనుమానాలు మొదలయ్యాయి.
ధోనీ రిటైర్మెంట్పై చేసిన ట్వీట్ను ఎలాంటి పరిస్థితుల్లో డిలీట్ చేయాల్సి వచ్చిందో చెప్పారు. ఆరోజు నాకు ఓ స్నేహితురాలు మెసేజ్ చేసి.. #DhoniRetires అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉందని చెప్పింది. దాంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అవన్నీ పుకార్లని ట్వీట్ చేశానని. అయితే తర్వాత దాన్ని డిలీట్ చేసినట్లుగా తెలిపారు. ఏదేమైనా నేను చెప్పాలనుకుంది చెప్పేశానని అన్నారు. నా పని అయిపోయింది. మెస్సెజ్ అందరికి తెలిసింది అని సాక్షి వివరించారు. .