మహేష్ సినిమాలో నటించబోతున్నారా..? హీరోయిన్ రియాక్షన్ ఏంటంటే..!
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించబోతున్న చిత్రం సర్కారు వారి పాట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు లేదా సెప్టెంబర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించబోతున్న చిత్రం సర్కారు వారి పాట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు లేదా సెప్టెంబర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ కోసం నటీనటులను ఎంపిక చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు పరశురామ్. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్, కియారా అద్వానీ పేర్లు ఇన్ని రోజులు వినిపిస్తుండగా.. ఇటీవల మరో పేరు తెరమీదికి వచ్చింది. సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సయీ మంజ్రేకర్ ఈ మూవీలో మహేష్తో రొమాన్స్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది.
తాజాగా ఈ విషయంపై ఆమెను ప్రశ్నించగా.. అవన్నీ నిజం కాదని తెలిపింది. ఒకవేళ ఆ ఆఫర్ వస్తే ఎలా స్పందిస్తారన్న ప్రశ్నకు.. అది ఇప్పుడే చెప్పలేను. అప్పటి పరిస్థితులను బట్టి అని సమాధానం ఇచ్చింది. కాగా తన తల్లిదండ్రులకు నమత్రా చాలా క్లోజ్ అని, బహుషా ఈ రూమర్లు అందుకే వచ్చి ఉండొచ్చని సయీ మంజ్రేకర్ తెలిపారు. కాగా సర్కారు వారి పాటను మైత్రీ మూవీ మేకర్స్,14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.
Read This Story Also: ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలి: పవన్ కల్యాణ్