కొరియోగ్రాఫర్గా మారనున్న సాయి పల్లవి.. ఎవరి కోసమంటే..!
సాయి పల్లవి అనగానే.. ఆమె సహజ నటన మాత్రమే కాదు డ్యాన్స్ కూడా అందరికి గుర్తొస్తుంది. మొదటి సినిమా నుంచి తన అద్భుత డ్యాన్స్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ వస్తోన్న ఈ నటి..
సాయి పల్లవి అనగానే.. ఆమె సహజ నటన మాత్రమే కాదు డ్యాన్స్ కూడా అందరికి గుర్తొస్తుంది. మొదటి సినిమా నుంచి తన అద్భుత డ్యాన్స్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ వస్తోన్న ఈ నటి.. ఇప్పుడు కొరియోగ్రాఫర్గా మారనున్నట్లు తెలుస్తోంది. అది తన సినిమాలోనే పాట కోసమేనని సమాచారం. ఈ మేరకు దర్శకుడు ఆమెను అడగటం, అందుకు ఫిదా బ్యూటీ ఓకే చెప్పేయడం జరిగిపోయాయని ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న లవ్ స్టోరీలో సాయి పల్లవి నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి మరో రెండు వారాల షూటింగ్ పెండింగ్లో ఉందట. ఇందులో ఓ పాట కూడా ఉందట. ఈ మొత్తాన్ని త్వరలోనే పూర్తి చేయాలనుకుంటున్న దర్శకుడు అందుకు సంబంధించిన పనులను ప్రారంభించేశారట. ఈ క్రమంలో ఈ మూవీలో మిగిలి ఉన్న ఒక్క పాటకు కొరియోగ్రఫీ చేయమని శేఖర్ కమ్ముల, సాయి పల్లవిని అడిగారట. అందుకు మలార్ బ్యూటీ హ్యాపీగా ఒప్పేసుకుందట. ఈ క్రమంలో ఈ పాటకు కంపోజ్ చేయడంతో పాటు అందులో సాయి పల్లవి కనిపించనుందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. కాగా రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీపై టాలీవుడ్లో మంచి అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.