రెమ్యూనరేషన్ పెంచేసిన ఫిదా భామ.. పవన్ సినిమాలో ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..

ఫిదా సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంది హీరోయిన్ సాయిపల్లవి. ఓ పక్కింటి అమ్మాయిలా గల గలా మాట్లాడుతూ

రెమ్యూనరేషన్ పెంచేసిన ఫిదా భామ.. పవన్ సినిమాలో ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 26, 2020 | 8:35 PM

ఫిదా సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంది హీరోయిన్ సాయిపల్లవి. ఓ పక్కింటి అమ్మాయిలా గల గలా మాట్లాడుతూ ఆ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. అంతేకాకుండా ఒక్క సినిమాతో తన కెరీర్‌ను కూడా డెవలప్ చేసుకుంది. దీంతో సాయిపల్లవికి ఇప్పుడు అవకాశాలు వరుసగా వెతుక్కుంటూ వస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగులో విరాట పర్వం సినిమాతో పాటు లవ్ స్టోరీలో కూడా నటిస్తోంది. దాంతో పాటు పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ లో కూడా సాయి పల్లవి నటించబోతుంది. ఇప్పటికే ఈ చిత్ర ఓపెనింగ్ కూడా జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రెమ్యూనరేషన్ అందరికి బాగానే ముడుతోంది. ఈ సినిమాలో రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్‌ను ఎంపిక చేసారు. ఇక పవన్ కళ్యాణ్ జంటగా సాయి పల్లవి నటించబోతుంది. ఇందులో నటించడానికి ఒక్కొక్కరికి భారీగానే పారితోషికాలు ఇస్తున్నారు. పవన్ దాదాపు 50 కోట్ల వరకు అందుకుంటుంటే.. రానా 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక ఐశ్వర్య రాజేష్ కూడా దాదాపు 60 లక్షల వరకు పారితోషికం అందుకోబోతుంది. మరోవైపు సాయి పల్లవి 2 కోట్లు తీసుకుంటుందని తెలుస్తోంది. పాత్ర నిడివి తక్కువగానే ఉన్నా ఇందులో సాయి పల్లవి నటిస్తే సినిమాకు మరింత హైప్ వస్తుందని భావించిన నిర్మాతలు ఆమె అడిగినంత ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి పవన్, సాయిపల్లవి కాంబినేషన్‌లో ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.