మూడేళ్ల తర్వాత మళయాళంలో సాయి పల్లవి మూవీ

ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండియన్ ఇండ్రస్ట్రీలు అన్నింటిని డిస్టబ్ చేసేసింది మలార్ బ్యూటీ సాయిపల్లవి. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. మధ్యలో చేసిన ఫిదా ఏ ముహూర్తంలో ఒప్పుకుందో కానీ సాయి పల్లవికి తన సొంత బాషలో మలయాళం సినిమా చేసే అవకాశం అందుకోలేకపోయింది. ఆఫర్లు లేక కాదు. తమిళ్ తెలుగులో ఇచ్చిన కమిట్ మెంట్స్ అన్నేసి ఉండటంతో మళయాళ సినిమాలు చేయలేకపోతుంది సాయి పల్లవి. చివరగా సాయి […]

మూడేళ్ల తర్వాత మళయాళంలో సాయి పల్లవి మూవీ
Follow us

|

Updated on: Mar 16, 2019 | 12:39 PM

ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండియన్ ఇండ్రస్ట్రీలు అన్నింటిని డిస్టబ్ చేసేసింది మలార్ బ్యూటీ సాయిపల్లవి. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. మధ్యలో చేసిన ఫిదా ఏ ముహూర్తంలో ఒప్పుకుందో కానీ సాయి పల్లవికి తన సొంత బాషలో మలయాళం సినిమా చేసే అవకాశం అందుకోలేకపోయింది. ఆఫర్లు లేక కాదు. తమిళ్ తెలుగులో ఇచ్చిన కమిట్ మెంట్స్ అన్నేసి ఉండటంతో మళయాళ సినిమాలు చేయలేకపోతుంది సాయి పల్లవి. చివరగా సాయి పల్లవి మలయాళంలో చేసిన మూవీ కలి. అందులో దుల్కర్ సల్మాన్ హీరో. దాని తర్వాత వచ్చిందే ఫిదా.

మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఈ మల్లు వుడ్ బ్యూటీ అక్కడో సినిమా చేసింది. అదే అతిరన్. టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు ఉన్న ఫర్హాద్ ఫాసిల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి వివేక్ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ కీలక భాగం పూర్తయిపోయింది. ఓ సైకియాట్రిస్ట్ హాస్పిటల్ నేపధ్యంలో సాగే కథగా ఇది రూపొందినట్టు తెలిసింది. దీని పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న సాయి పల్లవి మూడేళ్ళ తర్వాత మలయాళం మూవీ చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది

ప్రస్తుతం తను సూర్యతో చేసిన ఎన్జికే కోసం ఎదురు చూస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు గత ఏడాది ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన పడి పడి లేచే మనసు అంతగా ఆడకపోగా, మారి 2 తమిళ్ లో యావరేజ్ గా నిలిచింది.