Actor Saidharam tej: సరికొత్తగా రాబోతున్న మెగాహీరో.. హీస్టరికల్ స్టోరీలో నటించనున్న సాయి ధరమ్ తేజ్ ?
లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాక విడుదలైన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మంచి విజయాన్ని అందుకున్నాడు సాయి
లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాక విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమాతో రాబోయే సినిమాలకు ఊరట కలిగించాడు ఈ యంగ్ హీరో. తాజాగా ఈ హీరో మరో సినిమాకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ను జనవరి 25న విడుదల చేయనున్నామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో కార్ట్ లాంటి రథాన్ని లాగుతున్న కీలు గుర్రాలతో ఆసక్తిని రేపుతుంది. కుంకుమ పువ్వు రంగు, తెల్ల జెండాలతో కూడిన రథం ఇందులో కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే చారిత్రాత్మక కథతో రానున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా.. జగపతిబాబు, రమ్య కృష్మ కీలక పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా.. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరికొత్త లుక్లో కనిపించనున్నట్లుగా తెలుస్తోంది.
These horses? and the chariot represents..? KEEP GUESSING..!!
Revealing the Title & Motion poster of Supreme Hero @IamSaiDharamTej & @devakatta‘s #SDT14 tomorrow at 5pm.#RevealingSDT14@aishu_dil @IamJagguBhai @meramyakrishnan #ManiSharma @bkrsatish @JBEnt_Offl @ZeeStudios_ pic.twitter.com/KnrdMf7Cu0
— BARaju (@baraju_SuperHit) January 24, 2021