Saaho: మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్న ప్రభాస్ మూవీ
యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో విడుదలకు తేది దగ్గరపడుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సాహో ఆగష్టు 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రికార్డులను తిరగరాస్తున్న సాహో తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆ చిత్రాన్ని ప్రపంచ ప్రఖ్యాత థియేటర్ గ్రాండ్ రెక్స్లొ ప్రదర్శించనున్నారు. పారిస్లో ఉన్న ఈ థియేటర్లో ఒకేసారి 2,800మంది ప్రేక్షకులు సినిమాను చూసే అవకాశం ఉంటుంది. దీనికి […]
యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో విడుదలకు తేది దగ్గరపడుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సాహో ఆగష్టు 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రికార్డులను తిరగరాస్తున్న సాహో తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆ చిత్రాన్ని ప్రపంచ ప్రఖ్యాత థియేటర్ గ్రాండ్ రెక్స్లొ ప్రదర్శించనున్నారు. పారిస్లో ఉన్న ఈ థియేటర్లో ఒకేసారి 2,800మంది ప్రేక్షకులు సినిమాను చూసే అవకాశం ఉంటుంది.
దీనికి సంబంధించిన ఆ థియేటర్ వద్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ను ప్రారంభించారు. కాగా ఈ థియేటర్లలో ఇప్పటికే దక్షిణాది నుంచి కబాలి, బాహుబలి, మెర్సల్, విశ్వరూపం 2 వంటి చిత్రాలు ప్రదర్శించబడ్డాయి.
కాగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటించగా.. చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 18న హైదరాబాద్లో జరగనుంది. ఫిలింసిటీలో జరిగే ఈ వేడుకను టీవీ9 ప్రత్యక్ష ప్రసారం చేయబోతుంది.