‘సాహో’ దర్శకుడు సుజీత్ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..!
టాలీవుడ్లో వరుస పెళ్లి బాజాలు మోగుతున్నాయి. లాక్డౌన్ సమయంలోనూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొంతమంది వివాహం చేసుకోగా.. మరికొందరు నిశ్చితార్థం, రోకా
టాలీవుడ్లో వరుస పెళ్లి బాజాలు మోగుతున్నాయి. లాక్డౌన్ సమయంలోనూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొంతమంది వివాహం చేసుకోగా.. మరికొందరు నిశ్చితార్థం, రోకా వంటి కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సాహో దర్శకుడు సుజీత్ రెడ్డి నిశ్చితార్థం చేసుకున్నారు. తాను ప్రేమించిన ప్రవళ్లిక అనే డెంటిస్ట్కి ఆయన ఇవాళ ఉంగరం తొడిగేశారు. హైదరాబాద్లో జరిగిన ఈ వేడకకు ఇరు వర్గాల అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
కాగా పలు షార్ట్ ఫిలింస్తో మంచి పేరు తెచ్చుకున్న సుజీత్.. రన్ రాజా రన్ చిత్రం ద్వారా టాలీవుడ్లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో.. ఆ తరువాత ప్రభాస్ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ప్రభాస్తో సుజీత్ తెరకెక్కించిన సాహో గతేడాది ప్రేక్షకుల ముందుకు రాగా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే అందులో సుజీత్ డైరెక్షన్కి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ దర్శకుడు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. చిరు ప్రధాన పాత్రలో నటిస్తోన్న లూసిఫర్ రీమేక్కి సుజీత్ దర్శకత్వం వహించనున్నారు. కొరటాలతో చిరు సినిమా తరువాత ఈ మూవీ సెట్స్పైకి వెళ్లనుంది.
Read This Story Also: కరోనా పరీక్షలు.. ఏపీ ఖాతాలో మరో రికార్డు