తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్: ఈ నెల 13 వరకు రైతుబంధు దరఖాస్తుకు అవకాశం

తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. రైతుబంధు కు దరఖాస్తు చేసుకోడానికి వ్యవసాయ శాఖ మరో అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరిలో కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వారు, ఇంతకుముందే పాస్ పుస్తకాలు ఉండికూడా

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్: ఈ నెల 13 వరకు రైతుబంధు దరఖాస్తుకు అవకాశం
Follow us

| Edited By:

Updated on: Jun 10, 2020 | 10:28 AM

Rythu bandhu: తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. రైతుబంధు కు దరఖాస్తు చేసుకోడానికి వ్యవసాయ శాఖ మరో అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరిలో కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వారు, ఇంతకుముందే పాస్ పుస్తకాలు ఉండికూడా దరఖాస్తు చేసుకోనివారు, ఈ నెల 13 లోగా దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయశాఖ వెల్లడించింది. దరఖాస్తుతోపాటు భూమి పాస్ బుక్ జిరాక్స్ , ఎమ్మార్వో డిజిటల్ సంతకం చేసిన పేపర్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్(సేవింగ్స్ అకౌంట్) జోడించాలని ప్రకటన విడుదల చేసింది.

Also Read: కరోనా వైరస్ లక్షణాలు లేనివారితో.. సంక్రమణం అరుదు..: ప్రపంచ ఆరోగ్య సంస్థ