వెంకీ, వరుణ్ పారితోషికంపై పుకార్లు షికారు.. క్లారిటీ ఇచ్చిన ఎఫ్3 చిత్ర యూనిట్.. ఈసారి మరో హీరో కూడా జాయిన్ అవుతారట?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2019 సంక్రాతికి వచ్చిన ఎఫ్2 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు. కామెడీ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇందులో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ పోటాపోటీగా నటించి అందరి మన్ననలను పొందారు.

వెంకీ, వరుణ్ పారితోషికంపై పుకార్లు షికారు.. క్లారిటీ ఇచ్చిన ఎఫ్3 చిత్ర యూనిట్.. ఈసారి మరో హీరో కూడా జాయిన్ అవుతారట?
Follow us

|

Updated on: Nov 29, 2020 | 12:56 PM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2019 సంక్రాతికి వచ్చిన ఎఫ్2 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు. కామెడీ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇందులో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ పోటాపోటీగా నటించి అందరి మన్ననలను పొందారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు కొనసాగింపుగా ప్రస్తుతం ఎఫ్3 సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌పై చాలా పుకార్లు ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తున్నాయి.

హీరోలు భారీగా పారితోషికం అడుగుతున్నారని, వరుణ్ వెంకీతో సమానమైన పాత్ర నిడివి కోరుతున్నాడని, దర్శకుడు అనిల్ కూడా తన పారితోషికాన్ని భారీగా పెంచాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వాటన్నింటికి చెక్ చెప్పింది చిత్ర యూనిట్. అవన్నీ అబద్ధాలని, కేవలం పుకార్లేనని ప్రకటించింది. ఈ సినిమా చేసేందుకు వరున్ తేజ్, వెంకటేష్ ఇద్దరూ ఇంట్రెస్ట్‌గా ఉన్నారని, ఎఫ్2కు కొనసాగింపుగా కాకుండా మరో కొత్త కథతో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. అంతేకాకుండా ఈ సారి మరో హీరోను కూడా సినిమాలో చూపిస్తారని అంటున్నారు. ఆ హీరో కూడా సునీల్ అని కొంతమంది అంటున్నారు. త్వరగా సినిమాను ప్రారంభించి, సాధ్యమైనంత వేగంగా షూటింగ్‌ను పూర్తి చేసి సినిమా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఎఫ్ 2 తో పోల్చుకుంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎక్కువగా ఎంటర్‌టైనర్ చేస్తుందని ఇటీవల దర్శకుడు అనిల్‌ రావిపూడి తన బర్త్‌డే సందర్భంగా తెలిపారు. కరోనా, లాక్‌డౌన్‌తో విసిగి వేజారిన ప్రజలకు ఈ సినిమా కొంచెం రిలీఫ్ ఇస్తుందని పేర్కొన్నారు. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.