‘ఆర్టీఐ ‘ బిల్లు.. మూడు పార్టీలపై మాజీ సీఐసీ ఆగ్రహం

ప్రధాని మోదీ ప్రభుత్వం తెచ్చిన ఆర్టీఐ సవరణ బిల్లుకు టీఆర్ఎస్, వైసీపీ, బిజూ జనతాదళ్ (బీజేడీ) మద్దతు తెలపడంపట్ల మాజీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఈ పార్టీలకు ఓ లేఖ రాస్తూ.. అసలు ఈ సవరణ బిల్లును మీరుగానీ, మీ ఎంపీలుగానీ చదివారా అని ప్రశ్నించారు. లోక్ సభలో ఈ బిల్లు ఇటీవల ఆమోదం పొందగా,, రాజ్యసభ గురువారం ఆమోదించింది. రాజ్యసభనుంచి కాంగ్రెస్, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, […]

'ఆర్టీఐ ' బిల్లు.. మూడు పార్టీలపై మాజీ సీఐసీ ఆగ్రహం
Follow us

|

Updated on: Jul 27, 2019 | 1:53 PM

ప్రధాని మోదీ ప్రభుత్వం తెచ్చిన ఆర్టీఐ సవరణ బిల్లుకు టీఆర్ఎస్, వైసీపీ, బిజూ జనతాదళ్ (బీజేడీ) మద్దతు తెలపడంపట్ల మాజీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఈ పార్టీలకు ఓ లేఖ రాస్తూ.. అసలు ఈ సవరణ బిల్లును మీరుగానీ, మీ ఎంపీలుగానీ చదివారా అని ప్రశ్నించారు. లోక్ సభలో ఈ బిల్లు ఇటీవల ఆమోదం పొందగా,, రాజ్యసభ గురువారం ఆమోదించింది. రాజ్యసభనుంచి కాంగ్రెస్, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, ఇతర విపక్షపార్టీలు నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశాయి. దీనిని సెలక్ట్ కమిటీకి పంపాలని ఈ పార్టీల సభ్యులు కోరగా.. అందుకు ప్రభుత్వం నిరాకరించి ఓటింగ్ కు పెట్టింది. ఓటింగులో బిల్లుకు అనుకూలంగా 117 మంది, వ్యతిరేకంగా 75 మంది ఓటు చేయడంతో దీన్ని సభ ఆమోదించింది. అలాగే లోక్ సభలో అంతకుముందు ఈ బిల్లుకు అనుకూలంగా 218 మంది, ప్రతికూలంగా 79 మంది సభ్యులు ఓటు చేశారు. (దాంతో లోక్ సభ ఆమోదం కూడా దీనికి లభించింది). ఈ సవరణ బిల్లు వల్ల కలిగే కొత్త సమస్యలను మీరు గుర్తించ లేదని శ్రీధరాచార్యులు తన లేఖలో తెరాస, వైసీపీ, బీజేడీ నేతలను విమర్శించారు. మీరంతా ప్రజా సంక్షేమానికి పాటు పడే నాయకులని, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎన్నో త్యాగాలు చేశారని సెటైర్ వేసిన ఆయన.. అయితే ఈ బిల్లులోని కొన్ని అంశాల విషయంలో మొదట మీరు న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవలసి ఉండిందని పేర్కొన్నారు. ఇందులోని అంశాలు రాష్ట్రాల అధికారాలను హరించేవిగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. బిల్లులోని సెక్షన్ 4 (1) సీ వంటివి మోరల్ గా, లీగల్ గా, రాజ్యాంగపరంగా, రాజకీయంగా కూడా వివిధ రాష్ట్రాల హక్కులను నీరుగార్చేవిగా ఉన్న విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ఈ చర్య . అధికార ‘ కేంద్రీకృతం ‘గా ఉందని, ,ఇన్ఫర్మేషన్ కమిషనర్ల జీతాలు, ఇతర ప్రయోజనాల కల్పనలో కేంద్రానికే అధికారాలను కట్టబెడుతూ ఈ సవరణబిల్లులో నిర్దేశించారని ఆయన అన్నారు. . అటు- ప్రతిపక్షాల సభ్యులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టీఐ చట్టానికి ఇది గండి కొడుతోందని, ప్రభుత్వం సీఐసి హక్కులను అణచి వేస్తోందని యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఇటీవల లోక్ సభలో తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో