వెనక్కి తగ్గేదే లేదు.. ఉద్యోగాలు తీసే అధికారం కేసీఆర్కు లేదు:ఆర్టీసీ జేఏసీ
మంగళవారం రాత్రిలోగా విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. సిబ్బందికి డెడ్లైన్ విధించిన నేపథ్యంలో.. ఆర్టీసీ జేఏసీ కీలక భేటీ నిర్వహించింది. ఆదివారం ఉదయం సమావేశమైన జేఏసీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లోని హైలైట్స్: సమస్యలపై చర్చించకుండా ఏ ఆర్టీసీ ఉద్యోగి విధుల్లో చేరరు. సీఎం కేసీఆర్ డెడ్లైన్లు పెట్టడం కొత్తకాదు కోర్టులను కూడా సీఎం డిక్టేట్ చేస్తున్నారు ఉద్యోగాలను తీసే […]
మంగళవారం రాత్రిలోగా విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. సిబ్బందికి డెడ్లైన్ విధించిన నేపథ్యంలో.. ఆర్టీసీ జేఏసీ కీలక భేటీ నిర్వహించింది. ఆదివారం ఉదయం సమావేశమైన జేఏసీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.
ఆ వ్యాఖ్యల్లోని హైలైట్స్:
- సమస్యలపై చర్చించకుండా ఏ ఆర్టీసీ ఉద్యోగి విధుల్లో చేరరు.
- సీఎం కేసీఆర్ డెడ్లైన్లు పెట్టడం కొత్తకాదు
- కోర్టులను కూడా సీఎం డిక్టేట్ చేస్తున్నారు
- ఉద్యోగాలను తీసే అధికారం సీఎంకు లేదు
- డిపో మేనేజర్లు కూడా సమ్మెలో పాల్గొనాలి
- చర్చలు జరిపి కార్మికులకు డెడ్లైన్లు పెట్టాలి
- జీహెచ్ఎంసీ డబ్బులు ఇస్తుందని సీఎం చట్టం చేశారు
- ఐదు వేల బస్సులు ప్రైవేట్కు ఇస్తే 5 వేల బస్సులే మిగులుతాయి
- ఐదు వేల బస్సులకు 27వేల మంది కార్మికులే అవసరమవుతారు
- మిగతా 23 వేల కార్మికులను ఏం చేస్తారు
- సమస్యలను పరిష్కరిస్తే యూనియన్లను వైండప్ చేస్తాం
- కార్మికులను భయపెట్టే ధోరణిలో సీఎం మాట్లాడారు
- ఆత్మద్రోహం చేసుకొని విధుల్లో చేరాల్సిన అవసరంలేదు
- కార్మికులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు
- 4న రాజకీయ పార్టీలతో కలసి డిపోల వద్ద ధర్నాలు
- 5న సడక్ బంద్లో భాగంగా రహదారుల దిగ్బంధనం
- 6న డిపోల వద్ద ఆర్టీసీ కార్మిక కుటుంబాల నిరసన
- 7న ప్రజా సంఘాలతో కలిసి ప్రదర్శనలు
- 8న చలో ట్యాంక్బండ్ ముందస్తు సన్నాహక కార్యక్రమాలు
- 9న చలో ట్యాంక్బండ్, సామూహిక నిరసనలు కాగా… పరీక్షల దృష్ట్యా.. ఈ నెల 5న చేపట్టిన రహదారుల దిగ్బంధం వాయిదా వేస్తున్నామని తెలిపారు అశ్వత్థామరెడ్డి