ఏపీలో టీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి
విజయవాడ : కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల వద్ద జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. నిర్మల్ నుంచి ఒంగోలు వెళ్తున్న టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బస్సుడ్రైవర్తో పాటు కండక్టర్ కూడా మృతి చెందారు. మరో ఎనిమిది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని మెరుగైన వైద్యం కోసం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. నెమ్మదిగా వెళ్లమని పాసింజర్స్ చెబుతున్నా కూడా… […]
విజయవాడ : కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల వద్ద జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. నిర్మల్ నుంచి ఒంగోలు వెళ్తున్న టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బస్సుడ్రైవర్తో పాటు కండక్టర్ కూడా మృతి చెందారు. మరో ఎనిమిది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని మెరుగైన వైద్యం కోసం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. నెమ్మదిగా వెళ్లమని పాసింజర్స్ చెబుతున్నా కూడా… డ్రైవర్ పట్టించుకోకుండా బస్సు నడిపినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది.బస్సు సర్వీస్ నెంబర్ 3122.