సీఎం సహాయ నిధికి బ్రాడ్రిడ్జ్ భారీ విరాళం
కరోనా నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి బ్రాడ్రిడ్జ్ అనే ఐటీ కంపెనీ భారీ విరాళం ప్రకటించింది. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ ని కలిసిన బ్రాడ్రిడ్జ్ కంపెనీ ప్రతినిధులు చెక్కును అందజేశారు.
కరోనా నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి బ్రాడ్రిడ్జ్ అనే ఐటీ కంపెనీ రూ. 50 లక్షలు విరాళం ప్రకటించింది. ఈ మేరకు రూ. 50 లక్షల చెక్కును ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్కు బ్రాడ్రిడ్జ్ కంపెనీ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా వారిని మంత్రి కేటీఆర్ అభినందించారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో ముందు వరుసలో ఉండి పని చేస్తున్న హెల్త్ కేర్ వర్కర్స్, పోలీసుల పట్ల పేటీం, లైఫ్ బాయ్ సోప్, యూ వూరు కెన్ సంస్థలు మానవత్వాన్ని చాటుకున్నాయి. ఈ మేరకు ఒక లక్ష హైజిన్ ప్రొడక్ట్స ను మంత్రి కేటీఆర్కు ఆయా సంస్థల ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
Many thanks to @Broadridge India for donating Rs. 50,00,000/- to CM Relief Fund to combat #COVID19 crisis. Appreciate your social responsibility: Minister @KTRTRS pic.twitter.com/ty7jLFwriB
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 3, 2020