తిరుపతిలో దారుణం…నడిరోడ్డుపై రియల్టర్ మర్డర్
తిరుపతిలో రౌడీషీటర్ మర్డర్ కలకలం సృష్టిస్తోంది. పాతకక్షలతోనే ప్రత్యర్థులు అతనిని అంతమొందించినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. శనివారం రాత్రి తిరుపతిలోని లీలామహల్ సెంటర్ ఎస్ కే పాస్ట్ వద్ద మురళిని దుండగులు కిరాతకంగా కత్తులతో నరికారు. దీంతో అతడు స్పాట్లోనే మృతి చెందాడు. నడిరోడ్డుపై ఈ దారుణం జరగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. కాగా మృతుడు మురళిపై గతంలోనే పలు కేసులు నమోదైనట్టు సమాచారం. 2017లో..భార్గవ్ అనే వ్యక్తి హత్యకేసులో మురళి ప్రధాన నిందితుడిగా ఉన్నట్టు […]
తిరుపతిలో రౌడీషీటర్ మర్డర్ కలకలం సృష్టిస్తోంది. పాతకక్షలతోనే ప్రత్యర్థులు అతనిని అంతమొందించినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. శనివారం రాత్రి తిరుపతిలోని లీలామహల్ సెంటర్ ఎస్ కే పాస్ట్ వద్ద మురళిని దుండగులు కిరాతకంగా కత్తులతో నరికారు. దీంతో అతడు స్పాట్లోనే మృతి చెందాడు. నడిరోడ్డుపై ఈ దారుణం జరగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.
కాగా మృతుడు మురళిపై గతంలోనే పలు కేసులు నమోదైనట్టు సమాచారం. 2017లో..భార్గవ్ అనే వ్యక్తి హత్యకేసులో మురళి ప్రధాన నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు తెలపారు. మొత్తం ఎనిమిది మందికి మురళి హత్యలో భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.