భారత్ VS శ్రీలంక: రోహిత్ సెంచరీ..వరల్డ్కప్ హిస్టరీలో నయా రికార్డు
శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 36.5ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (94 బంతుల్లో 103 పరుగులు, 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో రోహిత్ వరల్డ్ కప్లలో ఓ కొత్త రికార్డును కూడా నెలకొల్పాడు. ఈ ప్రపంచకప్లో ఐదో సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా ఓ ప్రపంచకప్లో ఐదు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో నాలుగు సెంచరీలతో ఉన్న సంగక్కర రికార్డును […]
శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 36.5ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (94 బంతుల్లో 103 పరుగులు, 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో రోహిత్ వరల్డ్ కప్లలో ఓ కొత్త రికార్డును కూడా నెలకొల్పాడు. ఈ ప్రపంచకప్లో ఐదో సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా ఓ ప్రపంచకప్లో ఐదు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో నాలుగు సెంచరీలతో ఉన్న సంగక్కర రికార్డును భారత వైస్ కెప్టెన్ బద్దలుగొట్టాడు. సెంచరీ చేసిన వెంటనే రోహిత్ రజిత బౌలింగ్లో మాథ్యూస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
The Hitman just can’t miss at the moment ?
Rohit Sharma brings up his fifth ? at #CWC19 – no batsman has ever made as many at a single World Cup ?
What a player! pic.twitter.com/apwVq4WW6b
— Cricket World Cup (@cricketworldcup) July 6, 2019