అమెరికా దళాలే లక్ష్యంగా.. ఇరాక్ స్థావరాలపై రాకెట్ దాడులు
అమెరికా దళాలే లక్ష్యంగా మరోసారి దాడులు జరిగాయి. ఇరాక్లోని సైనిక స్థావరాలపై.. రాకెట్లతో దాడులు జరిగాయి. తాజీ స్థావరం వద్ద కత్యుషా రాకెట్లు పేలినట్లు.. ఇరాక్ మిలటరీ ప్రకటించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. దాదాపు రెండు రాకెట్లు అమెరికా దళాలు ఉన్న స్థావరాల వైపు దూసుకొచ్చినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఈ దాడికి సంబంధించి ఎవరూ బాధ్యత వహించలేదు. కాగా.. గత ఆదివారం అల్ బలాద్ వైమానిక స్థావరంపై కూడా ఇదే […]
అమెరికా దళాలే లక్ష్యంగా మరోసారి దాడులు జరిగాయి. ఇరాక్లోని సైనిక స్థావరాలపై.. రాకెట్లతో దాడులు జరిగాయి. తాజీ స్థావరం వద్ద కత్యుషా రాకెట్లు పేలినట్లు.. ఇరాక్ మిలటరీ ప్రకటించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. దాదాపు రెండు రాకెట్లు అమెరికా దళాలు ఉన్న స్థావరాల వైపు దూసుకొచ్చినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఈ దాడికి సంబంధించి ఎవరూ బాధ్యత వహించలేదు.
కాగా.. గత ఆదివారం అల్ బలాద్ వైమానిక స్థావరంపై కూడా ఇదే తరహాలో రాకెట్ దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నప్పటి నుంచి.. ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై పలుమార్లు రాకెట్ల దాడి జరిగింది. ఇరాన్ అగ్ర కమాండర్.. ఖాసీం సులేమానీ హత్య తర్వాత.. అమెరికా సైన్యమే లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. అయితే మంగళవారం జరిగిన దాడి కూడా ఇరాన్ పనే అయ్యుంటుందన్న ఆరోపణలు వినవస్తున్నాయి.