Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ..
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బుడంపాడు వద్ద పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో...
Road Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బుడంపాడు వద్ద పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ బోల్తా పడగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, వెల్లలూరు నుంచి 20 మంది బృందంగా ట్రాక్టర్పై పాత గుంటూరుకు పెళ్లికి వెళ్తున్నారు. ఆ సమయంలో బుడంపాడు వద్ద వారి ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. దాంతో ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read: