చెన్నై నడిరోడ్డుపై భారీగుంత
తమిళనాడు రాజధాని చెన్నైలో వాహనదారులకు పెనుప్రమాదం తప్పింది. మధ్య కైలాష్ ప్రాంతంలో గురువారం అకస్మాత్తుగా రోడ్డు భూమిలోకి కూరుకుపోయింది. నడిరోడ్డుపై నాలుగు మీటర్ల మేర గుంట ఏర్పడింది. కొంతమంది ఇది గమనించి అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే అధికారులు గుంతను పూడ్చే పనిలో పడ్డారు. అయితే ఈ గుంత ఎందుకు ఏర్పడిందన్న విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నడిరోడ్డుపై గుంత ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో వాహనదారులకు పెనుప్రమాదం తప్పింది. మధ్య కైలాష్ ప్రాంతంలో గురువారం అకస్మాత్తుగా రోడ్డు భూమిలోకి కూరుకుపోయింది. నడిరోడ్డుపై నాలుగు మీటర్ల మేర గుంట ఏర్పడింది. కొంతమంది ఇది గమనించి అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే అధికారులు గుంతను పూడ్చే పనిలో పడ్డారు. అయితే ఈ గుంత ఎందుకు ఏర్పడిందన్న విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నడిరోడ్డుపై గుంత ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.