కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

కృష్ణా జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు....

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి
Follow us

|

Updated on: Jun 17, 2020 | 7:24 PM

కృష్ణా జిల్లాలో(జూన్ 17) బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలతో ఉన్నవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న క్షతగాత్రులకు చికిత్స అందిస్తుండగా మరో ఐదుగురు కూడా  చనిపోయారు.

మృతులను మధిర మండలం తొండగ గోపవరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ గ్రామం నుంచి దాదాపు 25 మంది ట్రాక్టర్‌లో వేదాద్రి దైవదర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట శివారులో వేగంగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

చనిపోయినవారి వివరాలు ఇలా ఉన్నాయి…:

  1. వేమిరెడ్డి పద్మావతి (45)
  2. వేమిరెడ్డి పుల్లారెడ్డి (80)
  3. వేమిరెడ్డి భారతమ్మ( 75)
  4. వేమిరెడ్డి ఉదయ శ్రీ (08 )
  5. లక్కిరెడ్డి రాజేశ్వరి (30)
  6. గూడూరు అప్పమ్మ
  7.  సూర్యనారాయణ రెడ్డి (55)
  8.  రమణమ్మ (48)
  9. ఉపేందర్ (15)