కడపలో విషాదం.. లారీ డ్రైవర్, క్లీనర్ సజీవదహనం

వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట వద్ద హైవేపై ఆదివారం మ‌ధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఓ లారీ పూర్తిగా దగ్ధమవ్వ‌డంతో.. అందులోని డ్రైవర్‌, క్లీనర్‌ సజీవ దహనమయ్యారు.

కడపలో విషాదం.. లారీ డ్రైవర్, క్లీనర్ సజీవదహనం
Follow us

|

Updated on: Jun 07, 2020 | 2:29 PM

వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట వద్ద హైవేపై ఆదివారం మ‌ధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఓ లారీ పూర్తిగా దగ్ధమవ్వ‌డంతో.. అందులోని డ్రైవర్‌, క్లీనర్‌ సజీవ దహనమయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి కడప జిల్లా మైదుకూరు వైపుగా వెళ్తున్న సిమెంట్‌ లారీ డివైడర్‌ను బలంగా ఢీకొట్టి బోల్తాపడింది. ఈ క్ర‌మంలో లారీలో మంట‌లు చెర‌రేగాయి. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌, క్లీనర్‌ బయటకు రాలేక అందులోనే సజీవదహనమయ్యారు. స్థానికంగా ఈ ఘ‌ట‌న క‌ల‌కలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని ప‌రిశీలించి.. కేసు నమోదు చేసుకున్నారు.