రోడ్డు ప్రమాదంలో డీజిల్ ట్యాంక్ పేలి లారీ దగ్ధం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం అన్నారం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో డీజిల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. మంటలు అంటుకుని ఒక లారీ దగ్ధమైంది. అయితే మంటలు సమీపంలోని అడవిలోకి వ్యాపించాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం అన్నారం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో డీజిల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. మంటలు అంటుకుని ఒక లారీ దగ్ధమైంది. అయితే మంటలు సమీపంలోని అడవిలోకి వ్యాపించాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.