లారీ, బస్సు ఢీ.. ముగ్గురి పరిస్థితి విషమం
గుంటూరు జిల్లా నర్సారావుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 36 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ను అదుపులోకి […]
గుంటూరు జిల్లా నర్సారావుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 36 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.